సాక్షి, న్యూఢిల్లీ: చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటూ మహిళా వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ఆప్ సర్కార్ ఆమ్ ఆద్మీ పార్టీ కాదని ఖాస్ ఆద్మీ పార్టీగా మారిందని బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఆప్ సర్కార్ విధానాలను ఎండగట్టేందుకు ఈనెల 24న మొత్తం 14 జిల్లాల్లో ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించినట్టు బీజేపీ నగరశాఖ అధ్యక్షుడు విజయ్ గోయల్ వెల్లడించారు. బుధవారం పండిత్పంత్ మార్గ్లోని స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్తో సహా ఆప్ మంత్రులు, ఆప్ కార్యకర్తల తీరుతో రెండు రోజులపాటు ఢిల్లీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులపై అవినీతి కేసులు పెట్టకపోవడంతోనే కేజ్రీవాల్ సర్కార్కు మద్దతు కొనసాగిస్తోందని ఆరోపించారు. బీజేపీ శుక్రవారం నిర్వహించనున్న ధర్నాలో కొన్ని అంశాలను ప్రధానంగా ప్రస్తావించనుంది. దీనిలో ఆప్-కాంగ్రెస్ మధ్య ఉన్న చీకటి ఒప్పదం, రెండు రోజులపాటు ధర్నాతో ఆప్నాయకులు ప్రజలకు కలిగించిన ఇబ్బందులు ప్రధానంగా విమర్శించాలని నిర్ణయించారు. ఆప్ తన హామీల అమలులోనూ విఫలమైన తీరును ఎండగడతామని గోయల్ తెలిపారు. రిపబ్లిక్డే ఏర్పాట్లకు ఆటంకం కలిగించిన ఆప్ భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తామన్నారు.
ఆమ్ ఆద్మీ కాదు ఖాస్ ఆద్మీ పార్టీ
Published Wed, Jan 22 2014 11:33 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ హవా.. ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
ప్రశాంతంగా నీట్
కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయాలి
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
అ‘పూర్వ’ం.. ఆత్మీయం
కొడుకులు చూస్తుండగానే పోయిన ప్రాణాలు
నిప్పుల కొలిమి..
బీజేపీ అధికారంలోకి వస్తే భవిష్యత్ అంధకారం
తప్పక చదవండి
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement