Sakshi News home page

ఎన్నికలు జరపాల్సిందే

Published Sun, Aug 3 2014 10:05 PM

ఎన్నికలు జరపాల్సిందే - Sakshi

 న్యూఢిల్లీ: ప్రస్తుత అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆప్ డిమాండ్ చేసింది. ఈ మేరకు జాతీయ రాజధానిలో ఆదివారం ఆ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా జంతర్ మంతర్ వద్ద జరిగిన బహిరంగసభలో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పారిపోతున్నాయని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఢిల్లీలో ఎన్నికలు నిర్వహిస్తే ఓటమి తప్పదనే భయంతోనే ఆ రెండు పార్టీలు వెనుకంజ వేస్తున్నాయని ఆరోపించారు. నగరంలో ప్రజా పాలన లేకపోవడంతో సమస్యలు పేరుకుపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అసెంబ్లీని రద్దుచేసి తిరిగి నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మనీష్ సిసోడియా, పలువురు పార్టీ నాయకులు, వేలాదిమంది కార్యకర్తలు పాల్గొన్నారు.  
 

Advertisement
Advertisement