సోనియా, రాహుల్కు లేఖ రాసిన సీఎం సిద్ధరామయ్య
బెంగళూరు: రాష్ట్రంలో అవినీతి నిరోధక దళం(యాంటీ కరప్షన్ బ్యూరో-ఏసీబీ) ఏర్పాటు పై విపక్షాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఏసీబీని ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందనే అంశంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాంగ్రెస్ హైకమాండ్కు వివరణ ఇచ్చుకున్నారు. రాష్ట్రంలో ఏసీబీని ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, ఇతర రాష్ట్రాల్లో ఏసీబీ పనితీరు తదితర అంశాలను వివరిస్తూ ఏఐసీసీ అధ్యక్షరాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీలతో పాటు లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే, కర్ణాటక కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్లకు లేఖ రాశారు. ఈ లేఖలో ‘ఇప్పటికే 12 రాష్ట్రాల్లో ఏసీబీ విధులు నిర్వర్తిస్తోంది.
అందులో భాగంగానే కర్ణాటకలో సైతం ఏసీబీని ఏర్పాటు చేశాం. ఇక అధికారంలో ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ అవినీతిపై తన పోరాటాన్ని కొనసాగిస్తుందనే సందేశాన్ని ప్రజలకు అందించడానికే ఏసీబీని ఏర్పాటు చేశాము’ అని తన లేఖలో వివరించారు. ఈ లేఖతో పాటు ఏసీబీ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవోను సైతం సీఎం సిద్ధరామయ్య జత చేసినట్లు సమాచారం. కాగా, లోకాయుక్తను బలహీనపరచడంలో భాగంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏసీబీని రద్దు చేయాల్సిందిగా సీఎం సిద్దరామయ్యకు సూచించండంటూ జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి సైతం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీలకు లేఖలు రాశారు.
ఏసీబీ ఏర్పాటు ఎందుకంటే...
Published Wed, Mar 23 2016 3:09 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement