కేంద్ర నిఘావర్గాల హెచ్చరికతో నగరంలోని మాల్స్, మల్టీప్లెక్స్, థియేటర్లు, హోటళ్లలో భద్రతను కట్టుదిట్టం చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. రద్దీ ప్రాంతాలపై తీవ్రవాదులు గురి పెట్టారన్న సంకేతాలున్నాయి. దీంతో శనివారం మాల్స్, మల్టీప్లెక్స్ యాజమాన్యాలతో పోలీసులు చర్చించారు. చేపట్టాల్సిన భద్రత ఏర్పాట్లను వివరించారు.
సాక్షి, చెన్నై: మహానగరంలో ఇటీవల మాల్స్, మల్టీప్లెక్స్ల సంస్కృతి పెరిగింది. ఓ వైపు షాపింగ్ మరో వైపు సినిమా స్క్రీన్స్ వీటిలో ఉండడంతో జనం అటు వైపుగానే మొగ్గు చూపుతున్నారు. నగరంలో, శివారుల్లో కూడా ఈ మాల్స్, మల్టీప్లెక్స్ల సంఖ్య పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో జన సంచారం అత్యధికంగా ఇక్కడే ఉండడంతో, తీవ్ర వాదులు వాటిపై గురి పెట్టినట్టు సంకేతాలు వెలువడ్డాయి. రెండు రోజుల క్రితం నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్కు, శుక్రవారం సీబీఐ కార్యాలయానికి వచ్చిన బాంబు బెదిరింపులకు తోడుగా జన సంచారం అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో కుట్రలకు వ్యూహ రచన జరిగినట్టుగా నగర పోలీసు యంత్రాంగానికి సమాచారం అందింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. జన సంచారం అధికంగా ఉండే, అన్ని మాల్స్, మల్టీప్లెక్స్, థియేటర్లు, రెస్టారెంట్లు, హోటళ్లలో భద్రతను కట్టుదిట్టం చేయాలని కమిషనర్ జార్జ్ ఆదేశాలు జారీ చేశారు.
నిఘా కట్టుదిట్టం : నగరంలోని అన్ని మాల్స్, మల్టీప్లెక్స్లలో, థియేటర్లలో ప్రస్తుతం కల్పించిన భద్రతను, అక్కడున్న ఏర్పాట్లను తెలుసుకునేందుకు పోలీసు యంత్రాంగం నిర్ణయించింది. ఓ వైపు భద్రత కట్టుదిట్టానికి చర్యలు తీసుకుంటూనే, ఆయా మాల్స్, మల్టీప్లెక్స్ల ప్రతినిధులతో సమావేశానికి పిలుపునిచ్చింది. దీంతో మధ్యాహ్నం కమిషనరేట్లో అదనపు కమిషనర్ (దక్షిణం) అభయ్కుమార్ నేతృత్వంలో సమావేశం జరిగింది. ఆయూ ప్రాంతాల్లో ఉన్న భద్రతా ఏర్పాట్లను ఆరా తీశారు. ఇక మీదట చేపట్టాల్సిన భద్రతా చర్యలను వివరించారు. ప్రతి మాల్లోని అన్ని ప్రవేశ మార్గాల్లో ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది సంఖ్యను పెంచాలని, మెటల్ డిటెక్టర్ల సంఖ్యను పెంచాలని, ఆ పరిసరాల్లో సీసీ కెమెరాలు మరిన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.
కంట్రోల్ రూం ద్వారా ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల్లోని దృశ్యాలు పరిశీలించాలని, 24 గంటల్లో నమోదైన దృశ్యాల్ని మరో మారు పరిశీలించి ఏదేని అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవడం లేదా, పోలీసుల సాయం కోరేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. మాల్స్లోని అన్ని దుకాణాల్లోను నిఘా నేత్రాలు తప్పని సరి అని, ప్రతి వినియోగ దారుడిని క్షుణ్ణంగా తనిఖీలు చేసినానంతరం లోనికి అనుమతించాలని సూచించారు. పార్కింగ్ స్టాండ్లలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రతి వాహనాన్ని తనిఖీలు చేసినానంతరం లోనికి అనుమతించాలని ఆదేశించారు. తాము జరిపే తనిఖీల్లో ఏదేని భద్రతా లోపాలు ఉంటే సంబంధిత మాల్స్, థియేటర్లపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. నగరంలోని రెస్టారెంట్లు, స్టార్ హోటళ్ల ప్రతినిధులతో మంగళవారం సమావేశానికి నిర్ణయించారు.
మాల్స్లో నిఘా
Published Sun, Nov 9 2014 4:39 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అక్కడ శృతి మించిందో.. మీ పాట శాస్వతంగా రద్దే!
స్మృతి ఇరానీని ఓడించడం ఖాయం: కిశోరీ లాల్ శర్మ
ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
ఎప్పుడూ పనీపనీ.. మాతో ఉండవా? అని నా కుమారుడు నిలదీశాడు
గ్రీన్ డ్రెస్లో కరిష్మా కపూర్.. జ్యువెలరీ షోరూంలో సందడి చేసిన భామ (ఫోటోలు)
రిజర్వేషన్లను తొలగించే కుట్ర జరుగుతోంది: నిర్మల్ సభలో రాహుల్
చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు
తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..
Beauty Tips: ఈ డివైస్ని వాడారో.. మీ ముఖం చక్కటి ఆకృతిలోకి..
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- సునీత, షర్మిలకు కొండా రాఘవరెడ్డి సవాల్
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement