రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు జరిగిన ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. అత్యధిక స్థానాలను కైవశం చేసుకోవడం ద్వారా అమ్మ హవాకు తిరుగులేదని సోమవారం వెల్లడైన ఉప ఎన్నికల ఫలితాలు చాటాయి. దీంతో అన్నాడీఎంకే వర్గాలు సంబరాలు చేసుకున్నాయి. బాణసంచా పేల్చి, స్వీట్లు పంచిపెట్టి ఆనందాన్ని పంచుకున్నాయి.
చెన్నై, సాక్షి ప్రతినిధి : ఇటీవలే పార్లమెంటు ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడ్డాయి. రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలన్నింటి తో (అన్నాడీఎంకే, డీఎంకే మినహా) భారతీయ జనతా పార్టీ బలమైన కూటమిగా మారినా ఒంటరిగా బరిలోకి దిగిన అన్నాడీఎంకే దాటికి తట్టుకోలేక పోయింది. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్, అన్నాడీఎంకే కంటే సీనియారిటీ కలిగిన డీఎంకే సైతం జయ సాధించిన ఫలితాలతో బిక్కమొహం వేశాయి. అన్నాడీఎంకే అదే జోరును స్థానిక సంస్థల ఉపఎన్నికల్లో కూడా కొనసాగించింది. ప్రతిపక్షాలు నామినేషన్ వేసేందుకు సైతం అవకాశం ఇవ్వకుండా ఎన్నికల కమిషన్ ఎన్నికల తేదీని ప్రకటించిందని ఆరోపిస్తూ కాంగ్రెస్, డీఎంకే సహా 9 పార్టీలు ఎన్నికలను బహిష్కరించాయి. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడటం ద్వారా ఊపుమీద ఉన్న బీజేపీ అన్నాడీఎంకేతో తలపడగా, బహిష్కరించిన పార్టీలన్నీ తెరవెనుక మద్దతిచ్చాయి.
వామపక్షాలు నామమాత్రంగా ఎన్నికల్లో నిలిచాయి. తిరునెల్వేలీని ఏకగ్రీవంతోనూ, కోయంబత్తూరు, తూత్తుకూడిల్లో ఎన్నికల్లో ఢీకొనడం ద్వారానూ అన్నాడీఎంకే చేజిక్కించుకుంది. కడలూరు, విరుదాచలం, అరక్కోణం, రామనాధపురం మునిసిపాలిటీల్లో అన్నాడీఎంకే గెలుపొందింది. కోవై మేయర్ అభ్యర్థి గణపతి 12,792 ఓట్లు, తూత్తుకూడి మేయర్ అభ్యర్థి అంతోనీగ్రీస్ 84,885 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బీజేపీ తన శక్తిమేరకు అన్నాడీఎంకేకు పోటీనిచ్చినా ఫలితం దక్కలేదు. పొల్లాచ్చి తాలూకా గోమంగళం పుత్తూరు పంచాయతీ 6 వార్డు బీజేపీ అభ్యర్థి సెల్వకుమార్ 660 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కన్యాకుమారి జిల్లాలోని పంచాయితీల్లో బీజేపీ, కాంగ్రెస్లు చెరి 3 స్థానాలను దక్కించుకున్నాయి. తిరునెల్వేలీ జిల్లా పాలై పంచాయతీ 1 వవార్డు స్వతంత్య్ర అభ్యర్థి పాల్రాజు 313 ఓట్లతో గెలుపొందారు.
తన ఓటుకూడా వేరేవారికి
ఎలాగూ ఓడిపోతున్నాం, తన ఓటు వృథా కావడం ఎందుకు అనుకున్నాడో ఏమో ఆ అభ్యర్థి, తన ఓటును కూడా వేరే వారికి వేసి చేతులు దులుపుకున్నాడు. ఫలితంగా నామక్కల్ జిల్లా ఏడైవీడు పంచాయతీ వార్డు స్వతంత్ర అభ్యర్థి పళనిస్వామికి సున్నా ఓటే దక్కింది. ఆయన కుటుంబ సభ్యులు సైతం మరో అభ్యర్థికి ఓటు వేయడం విచిత్రం. ఎన్నికల్లో ఒక్క ఓటేకదా అని తీసిపారేయకూడదని నిరూపించాడు ఓ అభ్యర్థి. తిరుచ్చి జిల్లా పుల్లంపాడి పంచాయతీ వార్డు స్వతంత్ర అభ్యర్థి 162 ఓట్లతో గెలుపొందగా అన్నాడీఎంకే అభ్యర్థి కేవలం ఒక్క ఓటు తేడాతో (161)ఓడిపోయాడు.
స్థానిక ఎన్నికల్లో ‘జయ’ కేతనం
Published Tue, Sep 23 2014 12:50 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement