గుండుపాలెంలో అఖిలపక్ష నేతల పర్యటన | Sakshi
Sakshi News home page

గుండుపాలెంలో అఖిలపక్ష నేతల పర్యటన

Published Tue, Oct 4 2016 12:20 PM

all party leaders visits in gundupalem in bandaru Mandalam

విజయవాడ : మచిలీపట్నం పోర్టు కోసం తమ నుంచి బలవంతపు భూసేకరణ చేస్తున్నారని రైతులు ఆరోపించారు. మంగళవారం మచిలీపట్నం మండలం గుండుపాలెం గ్రామంలో భూపరిరక్షణ పోరాట సమితి నేతలతోపాటు అఖిలపక్ష నేతలు పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపడుతున్న బలవంతపు భూసేకరణపై సదరు నేతలకు రైతుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

రైతులతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణతోపాటు భూపరిరక్షణ పోరాట సమితి నేతలు మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ నాయకుడు పేర్ని నాని కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement