సాక్షి ముంబై: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లు ఆదివారం దసరా జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. కొందరు సోమవారం విజయదశమి జరుపుకుంటున్నా.. ఎక్కువ మంది మాత్రం ఆదివారమే పండగను జరుపుకుంటున్నారు. దీంతో గత కొన్ని రోజులుగా పూజలు అందుకుంటున్న దేవిమాత విగ్రహాలను ఆదివారం నిమజ్జనం చేయనున్నారు. ఇందుకోసం నిమజ్జన ఘాట్ల వద్ద అన్ని ఏర్పాట్లు చేసినట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు తెలిపారు. ఘాట్లకు వెళ్లే మార్గాలతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అనుచిత ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. చాలా మంది తెలుగువాళ్లు శనివారమే సద్దుల బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు.
కుర్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
కుర్లాలోని సంబాజీ చౌక్ వద్ద శ్రీ మార్కండేయ పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో శనివారం బతుకమ్మ పండగను ఘనంగా నిర్వహించారు. దాదాపు 150 మంది మహిళలు వేడుకల్లో పాల్గొనడం విశేషం. సర్వాంగ సుందరంగా బతుకమ్మలను పేర్చిన వారికి సమాజం తరపున బహుమతులు అందజేశారు. ఈ సంవత్సరం అతి పెద్ద బతుకమ్మను అలంకరించి తీసుకొచ్చిన చిలువేరి అర్చన ప్రథమ బహుమతి సాధించింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన కంటె అశోక్ బహుమతిని ఆమెకు అందజేశారు. రెండో బహుమతి మంతెన స్వాతి, పాము సునితకు మహిళా అధ్యక్షురాలు మద్ది లావణ్య అందజేశారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ... బతుకమ్మ పండుగను, మన సంస్కృతిని కాపాడాలన్నారు. ఇందుకోసం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న వారికి ఎప్పుడూ సహకరిస్తానన్నారు. సంస్థ అధ్యక్షుడు సంగిశెట్టి అశోక్, ప్రధాన కార్యదర్శి చిలివేరి మురళీధర్, సహాయక కార్యదర్శి చిలివేరి అశోక్ తదితరులు పాల్గొన్నారు.
నేడు బతుకమ్మ వేడుకలు
సాక్షి, ముంబై: ఠాణేలో ‘తెలుగు సేవామండలి’ ఆధ్వర్యంలో ఆదివారం దసరా ఉత్సవాలతోపాటు బతుకమ్మ పండుగను నిర్వహించనున్నారు. లోకమాన్యనగర్ పాడా నంబరు రెండులోని మున్సిపల్ పాఠశాలలో సాయంత్రం నాలుగు గంటల నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. స్థానిక తెలుగు ప్రజలందరు తమ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడకోవడంతోపాటు ఆంధ్రులందరినీ ఒక్కచోటికి తేవాలనే సదుద్దేశంతో ఈ మండలిని ఏర్పాటు చేసినట్టు ఆ సంస్థ పదాధికారులుతెలిపారు. బతుకమ్మ పండుగను ఠాణేలో మొదటిసారి నిర్వహిస్తున్న ఘనత తమదేనని మండలి సభ్యులు తెలిపారు. గతంలో బతుకమ్మ పండగ లో పాల్గొనేందుకు అనేక మంది ముంబైలోని గోరెగావ్, వర్లి, భివండీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేవారు. ఈ సంవత్సరం నుంచి ఠాణేలోనే ఈ బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభించడంతో సమీపప్రాంతాల్లోని తెలుగువారంతా ఇక్కడికే రానున్నారు.
ఈ సందర్భంగా వివిధ సాంస్కృతి కార్యక్రమాలను ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. ప్రపంచ రికార్డు సృష్టించిన తెలుగు వ్యక్తి కిషన్ జగ్లర్ షో, తెలంగాణ, బతుకమ్మ, పల్లెపాట తదితర వినోద కార్యక్రమాలు ఉంటాయి. స్థానిక తెలుగు ప్రజలందరు పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని తెలుగు సేవామండలి నాయకులు శీలం భూమయ్య, ఎరవేణి గురు, పారిపెల్లి శంకర్, గుండారపు పుల్లయ్య, మెంగు రమేష్, శంకర్ గంగాధరిలు ఓ ప్రకటనలో తెలిపారు.
దసరాకు అంతా సిద్ధం
Published Sat, Oct 12 2013 11:50 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement