పింప్రి, న్యూస్లైన్: త్వరలో మరో ఉద్యమానికి ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే శ్రీకారం చుట్టనున్నారు. ప్రజల కోసం పనిచేయని, ప్రజల మాట వినని నాయకులను వెనక్కు తీసుకువచ్చే చట్టం ‘రైట్ టు రీకాల్’ కోసం త్వరలో ఆందోళన నిర్వహించనున్నట్లు చెప్పారు. ‘లడో లోక్పాల్ ఛా.. ఉద్రేక్ ఆమ్ ఆద్మీ ఛా’ పుస్తకాన్ని పుణేలో సోమవారం ఆవిష్కరించిన సందర్భంగా హజారే మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రభుత్వానికి జనశక్తి బలమేంటో చూపించాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో ఏ పార్టీకి కూడా పూర్తి మెజార్టీ వచ్చే సూచన కనిపించడం లేదన్నారు.
యువ శక్తి ఈ ఎన్నికలలో ముఖ్య భూమికగా నిలుస్తుందన్నారు. ఎన్నికల్లో నోటు ద్వారా అధికారానికి వచ్చి ప్రజల బాగోగులను మరిచి, ఐదు సంవత్సరాల వరకు నియోజకవర్గంవైపు చూడని ప్రజా ప్రతినిధులను పదవి నుంచి తొలగించే అధికారాన్ని ప్రజలకు ఇవ్వాల్సిన అవసరముందన్నారు. ఇందుకోసం ‘వెనక్కు పిలిచే’ హక్కును కల్పించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ హక్కు కోసం త్వరలో త్వరలో ఆందోళన చేస్తామని, ప్రజలే దేశానికి యజమానులని, అభివృద్ధి అనేది కిందిస్థాయి నుంచి జరగాలని, ఈ విషయంపై ప్రజల్లో జన జాగృతి కల్పిస్తానని ఆయన తెలిపారు. మరో నెలరోజుల్లో ఆందోళనకు సిద్ధమవుతానని తెలిపారు. ఇదిలావుండగా హజారే ఆవిష్కరించిన ఈ పుస్తకాన్ని ధనంజయ విజలే రచించారు. ఈ కార్యక్రమంలో స్వాభిమాన్ సంఘటన అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు రాజుశెట్టి, డాక్టర్ విశ్వంభర్ చౌదరి, అవినాష్ ధర్మాధికారి, సునీల్ మెహతా తదితరులు పాల్గొన్నారు.
జన్లోక్పాల్ బిల్లు కోసం అన్నా హజారే ప్రారంభించిన ఉద్యమం దేశవ్యాప్తంగా ఎంతటి పెద్ద ఉద్యమంగా మారిందో తెలిసిందే. హాజరే దీక్షకు దిగివచ్చిన కేంద్రం ఎట్టకేటకు జన్లోక్పాల్ బిల్లును రూపొందించి, అమల్లోకి కూడా తెచ్చింది. కాగా తాజాగా హజారే ప్రాంభించనున్న ఉద్యమం ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి.
మరో ఉద్యమానికి శ్రీకారం
Published Tue, May 13 2014 10:35 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement