Sakshi News home page

చంద్రబాబు పబ్లిసిటీకి రూ.9లక్షల 50వేలు

Published Sat, Oct 22 2016 1:57 PM

బాబు పబ్లిసిటీ కోసం పోలవరం నిధులు - Sakshi

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కారు దుర్వినియోగం చేస్తున్న తీరు మరోసారి తేటతెల్లమైంది. పాటల కోసం ప్రభుత్వం ఏకంగా తొమ్మిదిన్నర లక్షల రూపాయలు విడుదల చేసింది. కృష్ణా -గోదావరి నదుల అనుసంధానంలో భాగంగా గతేడాది సెప్టెంబర్‌ 16న విజయవాడ సంగమంలో చంద్రబాబు ప్రభుత్వం ఓ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో  మూడు పాటలు వినిపించారు. 

రాజమండ్రి పార్లమెంట్‌ సభ్యుడు మురళీ మోహన్ ఈ పాటలు రూపొందించారు. వందేమాతరం శ్రీనివాస్ సంగీత దర్శకత్వంలో రూపొందించిన   మూడు పాటలను వందేమాతరం శ్రీనివాస్‌, బాలసుబ్రహ్మణ్యం పాడారు.  ఈ పాటలకు సంబంధించిన బిల్లులను తాజాగా పట్టిసీమ  ఇంజినీర్‌-ఇన్‌-చీఫ్‌ సమర్పించారు. ఈ బిల్లును భారీ నీటిపారుదల శాఖ మూలధనం ఖాతా నుంచి చెల్లించాలని
జీఓ 673లో పేర్కొన్నారు.

Advertisement
Advertisement