నగరాభివృద్ధి శాఖ మంత్రి వినయ్కుమార్ సొరకె
ప్రతి కార్మికుడికి నెలకు రూ. పది వేల జీతం
పది కార్పొరేషన్లను కలిపి ఒక కమిషనరేట్ ఏర్పాటు
బెంగళూరు : రాస్ట్రంలో కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేస్తున్న పౌర కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ ప్రతి నెల 10,500 జీతం ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు నగరాృవద్ధి శాఖ మంత్రి వినయ్కుమార్ సొరకె తెలిపారు. బుధవారం ఉదయం ఆయన కేపీసీసీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. దశల వారీగా పౌరకార్మికుల కాంట్రాక్ట్ను రద్దు చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఈ విషయంపై రాష్ర్ట ముఖ్యమంత్రితో చర్చించినట్లు తెలిపారు. బెంగళూరు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 19 వేల మంది పౌర కార్మికులు పనిచేస్తుండగా 12 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారని తెలిపారు. రాష్ర్టంలోని పది కార్పొరేషన్లను కలిపి ఒక కమిషనరేట్గా ఏర్పాటు చేయడంతో పాటు ఓ ఐఎఎస్ అధికారిని కమిషనర్గా నియమించనున్నట్లు చెప్పారు.
అలాగే చెత్త సేకరణ, డ్రెయినేజీల నిర్వహణ కోసం రాష్ర్ట స్థాయిలో ఓ కమిటీని నియమించడం జరుగుతుందన్నారు. అక్రమ - సక్రమకు సంబంధించి కోర్టు తీర్పు వివరాలు అందగానే అమలు చేయనున్నట్లు చెప్పారు. మున్సిపాలిటీ స్థలాలను ఆక్రమించుకున్న వారిపై చర్యలు చేపడతామని అన్నారు. నగరాల్లో తాగునీరు, డ్రెయినేజీ సమస్యలు అరికట్టేందుకు ఈ ఏడాది బడ్జెట్లో మరింత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. దళిత వ్యక్తిని సీఎం చేయాలన్న డిమాండ్లో తప్పు లేదని, అయితే ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య సమర్థవంతంగా పాలిస్తున్నప్పుడు ఈ డిమాండ్కు అర్థం లేకుండా పోతుందని అన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులుగా పౌర కార్మికులు
Published Thu, Feb 19 2015 1:24 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement