► జారీ చేసిన అసిస్టెంట్ పోలీస్ కమిషనర్
► నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలని హెచ్చరిక
సాక్షి, ముంబై : ఏటీఎం కేంద్రాలకు డబ్బులు తరలించే కంపెనీలకు, ప్రైవేటు సెక్యూరిటీ సంస్థలకు అసిస్టెంట్ పోలీసు కమిషనర్ అతుల్ చంద్ర కులకర్ణి కొన్ని మార్గదర్శక సూచనలు జారీ చేశారు. వాటిని అమలు చేయని సంస్థలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేటి పోటీ ప్రపంచంలో ఖాతాదారులను అకట్టుకునేందుకు బ్యాంకులు అనేక సౌకర్యాలు కల్పిస్తున్నాయి. అందులో ఏటీఎం సౌకర్యం ప్రధానమైనది. అయితే నగరంలోని అనేక సొసైటీ, బహుళ అంతస్తుల భవనాలు, ఫుట్పాత్లపై ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా వాటిని ఏర్పాటు చేస్తున్నారు.
వాటిలో డబ్బు నింపే బాధ్యతను ప్రైవేటు సెక్యూరిటీ సంస్థలు, కంపెనీలు స్వీకరించాయి. కాని బ్యాంకు నుంచి డబ్బు తీసుకెళ్లే వ్యాన్లు మార్గమధ్యలో లేదా ఏటీఎం సెంటర్ వద్ద దోపిడీకి గురవుతున్నాయి. అత్యధిక శాతం చోరీ కేసుల్లో ఆ కంపెనీల సిబ్బంది హస్తమున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో ఇలాంటి సంఘటనలకు ఫుల్స్టాప్ పెట్టాలని అసిస్టెంట్ పోలీసు కమిషనర్ (నేర శాఖ) అతుల్ చంద్ర కులకర్ణి నిర్ణయం తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో ఏటీఎంలలో నగదు అమర్చే సంస్థలతో సమావేశం నిర్వహించారు. 37 సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా క్యాష్ వ్యాన్లలో నగదు తరలించే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? వాహనాల్లో ఎలాంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచాలి..? అందులో పనిచేసే సిబ్బందికి సబంధించిన వివరాలు తదితర అంశాలపై ఆయన మార్గదర్శకాలు జారీ చేశారు.
అవేంటంటే..
♦ ప్రతి సిబ్బంది పూర్తి వివరాలను కంపెనీ సేకరించాలి.
♦ సిబ్బందికి గతంలో నేర చరిత్ర ఉందేమో పరిశీలించాలి.
♦ ప్రతీ క్యాష్ వ్యాన్లో జీపీఎస్ సేవలతోపాటు సీసీ టీవీ కెమెరాలు అమర్చుకోవాలి.
♦ నగదు చేరవేసే వాహనం పూర్తి వివరాలు ఉండాలి.
♦ సిబ్బంది గుర్తింపు కార్డు, ఫొటో క్యాష్ వాహనంలో ఉంచాలి.
♦ ఏటీఎంలో నగదు జమ చేసే సమయంలో ఎంతమంది బయట ఉండాలి...? ఎంత మంది లోపల ఉండాలనేది ముందుగానే ప్రణాళిక రూపొందించుకోవాలి.
♦ క్యాష్ వ్యాన్లో పనిచేసే సిబ్బందిని స్వయంగా కంపెనీలే నియమించుకోవాలి.
♦ క్యాష్ వాహనం ఏ రూట్లో వెళుతుందనే వివరాలు గోప్యంగా ఉంచాలి.
ఏటీఎం క్యాష్ డిపాజిట్ కంపెనీలకు మార్గదర్శకాలు
Published Tue, Apr 21 2015 10:48 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
చంద్రబాబు వల్లే అన్యాయం
గుడాల గోపికి అడుగడుగునా బ్రహ్మరథం
వైఎస్సార్ సీపీ ప్రభంజనం ఖాయం
జనసేన, టీడీపీకి రాంరాం
సంక్షేమం సగం బలం
సమస్యలపై నాన్చడం నచ్చదు..
చెల్లెం ఆనందప్రకాష్, రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు
ముస్లింలకు అండగా జగన్
చంద్రబాబు కనుసన్నల్లో ఈసీ నడుస్తోంది
తప్పక చదవండి
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
Advertisement