ప్రకాశం జిల్లాలో ఆటో బీభత్సం | Sakshi
Sakshi News home page

ప్రకాశం జిల్లాలో ఆటో బీభత్సం

Published Sat, Feb 18 2017 2:39 PM

auto hulchal in prakasam district

- ఇద్దరు మృతి
 
సంతమాగులూరు: ప్రకాశం జిల్లాలో ఆటో బీభత్సం సృష్టించింది. ఆర్టీసీ బస్సు కోసం ఎదురు చూస్తున్న వారి పైకి ఆటో దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన జిల్లాలోని సంతమాగులూరు బస్టాండ్‌ సమీపంలో శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. బస్సు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులపైకి ఆటో దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే చనిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతులు స్థానికంగా నివాసముండే ఏఎన్‌ఎమ్‌ రజియా బేగం(39), పోలమ్మ(68)గా పోలీసులు గుర్తించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement