ఆటో బోల్తా..ప్రయాణికులకు గాయాలు | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా..ప్రయాణికులకు గాయాలు

Published Mon, Dec 5 2016 5:08 PM

ఆటో బోల్తా..ప్రయాణికులకు గాయాలు - Sakshi

మెట్‌పల్లి : కరీంనగర్ జిల్లాలో సోమవారం ఓ ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటన మెట్‌పల్లి శివారులోని సింగాపురం గ్రామం వద్ద జరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్న 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

క్షతగాత్రులను వైద్యం నిమిత్తం జగిత్యాల, నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

Advertisement
Advertisement