Sakshi News home page

భాండుప్‌లో నాలుగేళ్ల బాలికపై అత్యాచారం

Published Wed, Dec 17 2014 10:24 PM

Bhandup in  four-year-old girl raped

సాక్షి, ముంబై: భాండూప్‌లోని మౌంట్ మేరీ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో బుధవారం నాలుగేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఈ అఘాయిత్యానికి పాల్పడిన అదే పాఠశాల కర్కుతోపాటు మరో ఇద్దరు అనుమానితులను స్థానిక భాండూప్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు వెంటనే పాఠశాలకు చేరుకున్నారు. పాఠశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతటితో ఆగకుండా తరగతి గదిలోని బెంచీలు, బల్లలు, కుర్చీలు, ఇతర విలువైన ఫర్నిచర్ ను బయటకు తీసుకొచ్చి నిప్పంటించారు. బాధితురాలితోపాటు కామాంధుడి పేరు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. కేసు విచారణలో ఉంది.

Advertisement

What’s your opinion

Advertisement