కోలారు నగరసభలో అమలు
కోలారు : పౌర కార్మికుల అనధికార గైర్హాజరును తప్పించేందుకు కోలారు నగరసభ కార్యాలయంలో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ విధానం ద్వారా సమయపాలన, క్రమశిక్షణ పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. సుమారు 1.50లక్షల జనాభా ఉన్న కోలారు నగరసభ పరిధిలో 35 వార్డులు ఉన్నాయి. నిత్యమూ 62 టన్నుల చెత్త బయటపడుతోంది. స్వచ్ఛత, డ్రెయినేజీ నిర్వహణకు మొత్తం 193 మంది పౌరకార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో 64 మంది శాశ్వత, 84 మంది ఒప్పంద, 32 మంది దినకూలీలు, 13 మంది సమాన వేతనంపై పనిచేస్తున్న కార్మికులు ఉన్నారు. ఈ 193 మంది కార్మికులలో పది మంది నగరసభలోని వివిధ రకాల వాహనాలకు డ్రైవర్లుగాను, యూజీడీ వాహనాలకు ఐదుగురు, ప్రభుత్వ కార్యాలయాలు, బంగళాల్లో పనిచేసేందుకు ఐదుగురు, ఉద్యానవనాల నిర్వహణకు పది మంది పోగా స్వచ్ఛతా కార్యక్రమాల్లో పాల్గొనేది కేవలం 140 మంది కావడం గమనార్హం. అధికారిక లెక్కల ప్రకారం ఈ 140 మందిలో నిత్యమూ వివిధ కారణాలతో 15 నుంచి 20 మంది సెలవులో వెళుతుంటారు. మరికొందరు అనధికారికంగా గైర్హాజరు అవుతుంటారు. మిగిలిన 90 నుంచి వంద మందితో నగరంలో స్వచ్ఛతా కార్యక్రమాలను చేపడుతుంటారు. విధుల్లో నిర్లక్ష్యం కనబరుస్తూ గైర్హాజరు అవుతున్న వారి సంఖ్య ఎక్కువ అవుతుండడంతో బయోమెట్రిక్ హాజ రును తప్పనిసరి చేస్తూ నగరసభ అధికారులు చర్యలు తీసుకున్నారు.
మరో పది రోజుల్లో పూ ర్తి స్థాయిలో అమల్లో రానున్న ఈ విధానం వల్ల పౌరకార్మికులు నిత్యం ఉదయం 5.30 నుంచి 5.45 గంటల్లోపు హాజరు సమర్పించాల్సి ఉంది. ఇదే విషయాన్ని నగర సభ అధ్యక్షుడు బి.ఎం.ముబారక్ స్పష్టం చేశారు. ‘నగర సభలో ఇప్పటికే సిబ్బంది, అధికారులకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నాం. పౌరకార్మికులకు ప్రతినెలా 10న వేతనాలు చెల్లిస్తున్నాం. నిత్య మూ వారికి ఉదయమే టిఫన్ ఏర్పాటు చేస్తున్నాం. అయినా వారు అనధికారికంగా విధులకు డుమ్మా కొడుతుండడంతో పారిశుద్ధ్య పనులకు ఆటంకం కలుగుతోంది. ఈ సమస్య నివారణకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని పౌరకార్మిలకూ అమలు చేయాలని భావించాం’ అని కోలారు నగరసభ కమిషనర్ లక్ష్మినారాయణ తెలిపారు.
పౌర కార్మికులకు బయోమెట్రిక్ హాజరు
Published Mon, Sep 14 2015 1:55 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement