పాదచారుడిపైకి దూసుకెళ్లిన ఎమ్మెల్యే కారు | Sakshi
Sakshi News home page

పాదచారుడిపైకి దూసుకెళ్లిన ఎమ్మెల్యే కారు

Published Fri, Sep 1 2017 9:20 AM

పాదచారుడిపైకి దూసుకెళ్లిన ఎమ్మెల్యే కారు - Sakshi

సాక్షి, బెంగుళూరు: మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తనయుడు, శికారీపూర్‌ ఎమ్మెల్యే బీవై రాఘవేంద్ర కారు పాదచారుడిపైకి దూసుకెళ్లిన దుర్ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. రాఘవేంద్ర తన నియోజకవర్గం శికారీపూర్‌ వైపు వెళ్తున్న సమయంలో హోన్నాళి తాలుకా వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిపైకి దూసుకెళ్లింది.

ఈ ఘటనలో సురేష్‌(24) అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఎంపీ రేణుకా చార్య ఘటనాస్థలిని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement