సాక్షి, చెన్నై : రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు సీఎం పన్నీరు సెల్వం సిద్ధం అవుతున్నారు. ఇందుకు తగ్గ కసరత్తుల్ని వేగవంతం చేశారు. ఆదివారం మంత్రి వర్గం భేటిలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెలాఖరులో అసెంబ్లీలో బడ్జెట్ దాఖలు చేయబోతున్నారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత జైలు శిక్ష నేపథ్యంతో సీఎంగా పన్నీరు సెల్వం బాధ్యతలు చేపట్టి నాలుగు నెలలు కావస్తున్నది. ఈ కాలంలో ప్రభుత్వ పరంగా చేపట్టిన కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణయాలు చెప్పుకోదగ్గవి లేవు. ఈ ఏడాది తొలి అసెంబ్లీ సమావేశంలో సీఎం పన్నీరు సెల్వం గవర్నర్ ప్రసంగం ద్వారా వరాలు ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారం జరిగింది. అయితే, గవర్నర్ కొణిజేటి రోశయ్య ప్రసంగం ప్రజల్ని నిరాశ పరిచింది. ఈ పరిస్థితుల్లో 2015-16కు గాను రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. బడ్జెట్ సమావేశాలను ఈ నెలాఖరులో ఆరంభించే విధంగా అధికార వర్గాలు కార్యాచరణను సిద్ధం చేసి ఉన్నాయి.
ఈ సమయంలో అసెంబ్లీలో బడ్జెట్ దాఖలు, ప్రతి పక్షాల విమర్శలు, ఆరోపణల్ని తిప్పికొట్టే విధంగా కసరత్తులకు సీఎం పన్నీరు సెల్వం సిద్ధం అయ్యారు. శాఖల వారీగా ఇప్పటికే ఆయా మంత్రులు సమీక్షించి నివేదికల్ని సిద్ధం చేశారు. ఆయా శాఖల్లో సాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, మున్ముందు అవసరమయ్యే నిధుల వివరాల్ని సీఎం పన్నీరు సెల్వంకు సమర్పించారు. దీంతో సమగ్ర బడ్జెట్ నివేదికను సిద్ధం చేయడం లక్ష్యంగా, ఆయా శాఖలకు జరిగిన కేటాయింపులపై సమీక్షించేందుకు ఆదివారం మధ్యాహ్నం రాష్ర్ట కేబినెట్ భేటీ అయింది. సచివాలయంలో మూడు గంటల నుంచి గంటన్నరకు పైగా సీఎం పన్నీరు సెల్వం నేతృత్వంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో అన్ని శాఖల మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. బడ్జెట్ తుది ప్రతిని సిద్ధం చేసి, అందుకు ఆమోద ముద్ర పడే రీతిలో ఈ సమావేశం సాగింది.
అలాగే, ప్రతి పక్షాలు చేస్తున్న విమర్శలు, ఆరోపణల్ని తిప్పికొట్టే విధంగా ప్రతి మంత్రి సిద్ధమయ్యే విధంగా సూచనలు, సలహాలు ఇచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య, పెండింగ్లో ఉన్న ఉచిత పథకాల అమలు వేగవంతం లక్ష్యంగా నిధుల కేటాయింపులు పెంచే విధంగా బడ్జెట్ రూపకల్పనకు చర్యలు తీసుకున్నారు. అలాగే, బడ్జెట్ తేదీ, ఎన్ని రోజులు నిర్వహించాలో అన్న అంశంతో పాటుగా పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ఈ భేటీ అనంతరం అసెంబ్లీ బడ్జెట్ ముహూర్తాన్ని ఖరారు చేసి రాజ్ భవన్ ఆమోదానికి పంపించనున్నారు. ఉద్వాసనకు గురైన మంత్రి అగ్రి కృష్ణమూర్తి రూపంలో అసెంబ్లీలో చిక్కులు ఎదురయ్యే పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్న దృష్ట్యా, ముందస్తు చర్యలకు సిద్ధమైనట్టు సమాచారం. ఆత్మహత్య చేసుకున్న వ్యవసాయ శాఖ అధికారి కేసును విచారించేందుకు ప్రత్యేక బృందం రంగంలోకి దిగడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ దాఖలుకు సిద్ధం కావడంతో ప్రతి ఏటా ప్రవేశ పెట్టే విధంగా ఈ ఏడాది కూడా పీఎంకే నేతృత్వంలో మాదిరి బడ్జెట్ను ప్రకటించారు.
పన్నీరు ‘బడ్జెట్’
Published Mon, Mar 9 2015 2:38 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement