చెన్నై - బెంగళూరు మధ్య బుల్లెట్ రైలు పట్టాలు ఎక్కేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ రైల్వే మార్గంలో వంద చోట్ల ట్రాక్ వంపులు తిరిగి ఉండడం, లెవల్ క్రాసింగ్స్ సమస్య నెలకొంది. కొత్త ట్రాక్కు కోట్లు కుమ్మరించాల్సిన దృష్ట్యా, అందుకు తగ్గ లాభాలు వచ్చేనా అన్న మీమాంసలో రైల్వే వర్గాలు ఉన్నాయి.
సాక్షి, చెన్నై : చెన్నై - బెంగళూరు మీదుగా మైసూర్ వరకు అతి వేగంతో వెళ్తే బుల్లెట్ రైలును నడిపేందుకు కేంద్ర రైల్వే యంత్రాంగం నిర్ణయించింది. ఇందుకు తగ్గ ప్రకటన గత ఏడాది రైల్వే బడ్జెట్ ద్వారా వెలువడింది. 160 కి.మీ.కన్నా అత్యధిక వేగంతో దూసుకెళ్లే ఈ రైలు సేవలు సాధ్యమా అన్నది తేల్చేందుకు ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. చైనాకు చెందిన నిపుణులతో పాటుగా రైల్వే యంత్రాంగంలోని ప్రత్యేక అధికారుల బృందం రెండు నెలలుగా పరిశీల నలో మునిగిపోయారు. ఈ పరిశీలన ప్రక్రియ ముగింపు దశకు చేరింది. ఇప్పటి వరకు జరిగిన పరిశీలనలో పాత ట్రాక్లో బుల్లెట్ రైలు పట్టాలెక్కేది అనుమానమేనన్న భావన ఈ బృందం వ్యక్తం చేసినట్లు సమాచారం.
పట్టాలెక్కేనా?: ఈ బృందం పరిశీలన మేరకు చెన్నై - బెంగళూరు - మైసూర్ మార్గంలో బుల్లెట్ రైలు పట్టాలెక్కించాల్సి ఉంది. చెనై నుంచి బెంగళూరుకు ఉన్న రైల్వే మార్గాన్ని ఈ బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. ప్రస్తుతం చెన్నై నుంచి బెంగళూరుకు ఉన్న రైల్వే ట్రాక్ల సామర్థ్యాన్ని ఆరా తీసింది. ట్రాక్లు పటిష్టంగా ఉన్నా, మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆ బృందం పరిగణించింది. ఈ మార్గంలో బెంగళూరు వరకు వంద చోట్ల వంపులు ఉండడం, లెవల్ క్రాసింగ్స్ మరిన్ని ఉండడం వెలుగు చూసింది. ఈ వంపులు ఐదు డిగ్రీల కోణంలో వంగి ఉండడంతో వాటిని సరి చేయాలంటే శ్రమతో కూడుకున్న పనిగా తేల్చారు. అతి వేగంగా దూసుకెళ్లే బుల్లెట్ రైలు మార్గంలో వంపులు, లెవల్ క్రాసింగ్లు ఉంటే ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువే.
ఈ దృష్ట్యా, పాత ట్రాక్ను పక్కన పెట్టి, కొత్తగా బుల్లెట్ రైలు కోసం ప్రత్యేకంగా ట్రాక్ ఏర్పాటు చేయాల్సి వస్తే అందుకు కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. కిలో మీటరు దూరానికి రూ.200 కోట్లు చొప్పున ఖర్చు పెట్టాల్సి రావడంతో పాటుగా ఈ పనులు ముగియడానికి కొన్నేళ్లు పట్టడం ఖాయం అన్న అభిప్రాయానికి వచ్చారు. స్థల సేకరణ సమస్య తప్పదని ఈ బృందం పరిశీలనలో స్పష్టమైంది. ఈ బృందం తన పరిశీలన ప్రక్రియను ముగించి ఫిబ్రవరిలో నివేదికను కేంద్ర రైల్వే యంత్రాంగానికి సమర్పించేందుకు సిద్ధమవుతోంది. ఈ నివేదిక ఆధారంగా కేంద్రం బుల్లెట్ రైలును పట్టాలెక్కించేది లే నిది తేలనుంది. ఈ విషయంగా ఆ బృందంలోని ఓ అధికారి పేర్కొంటూ, పాత ట్రాక్లో బుల్లెట్ రైలు సాగేది అనుమానమేనని పేర్కొన్నారు. కొత్త ట్రాక్ ఏర్పాటు చేయాల్సి వస్తే అందుకు కోట్లు కుమ్మరించాల్సి ఉంటుందని, అందుకు తగ్గ లాభాన్ని రైల్వే శాఖ ఆర్జించే అవకాశాలు తక్కువేనన్నారు. కోట్లాది రూపాయల నిధుల్ని కేంద్రం మంజూరు చేసేది అనుమానమేనని, ఈ దృష్ట్యా, ఆ మార్గంలో బుల్లెట్ ట్రాక్ ఎక్కేది డౌటేనని పేర్కొనడం గమనార్హం.
బుల్లెట్ కదిలేనా?
Published Thu, Jan 29 2015 12:51 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కాబోయేవాడు ఎలా ఉండాలంటే?.. జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
ఇండియా కూటమితో విభేదాలు.. వెనక్కి తగ్గిన దీదీ
నా కోసం కొంత డబ్బు కావాలి.. అందుకే నేనే అడిగా: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
International Family Day: ఐపీఎల్ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
సీఏఏ చట్టం కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
100 రోజులకు బ్లూ ప్రింట్ రెడీ.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తప్పక చదవండి
- ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement