బస్సు-ట్రాలీ ఢీ : పలువురికి గాయాలు | Sakshi
Sakshi News home page

బస్సు-ట్రాలీ ఢీ : పలువురికి గాయాలు

Published Tue, Sep 27 2016 12:12 PM

Bus-Trolley clashes in nellore few passengers injured

మనుబోలు : ఓల్వో బస్సు–ట్రాలీ ఢీకొని పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా, త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ సంఘటన మండలంలోని జాతీయ రహదారిపై పొదలకూరు క్రాస్‌ రోడ్డ వద్ద సోమవారం జరిగింది.

పోలీసుల సమాచారం మేరకు.. బెంగళూరు నుంచి యాత్రాజనీ ఓల్వో బస్సు 38 మంది ప్రయాణికులతో విజయవాడకు వెళ్తుంది. మండలంలోని పొదలకూరు క్రాస్‌ రోడ్డు వద్ద హైవే నుంచి ఓ ట్రాలీ హఠాత్తుగా మలుపు తిరగడంతో బస్సు ట్రాలీని ఢీకొంది. దీంతో బస్సు ముందు అద్దాలు పగిలి దెబ్బతింది. బస్సుడ్రైవర్‌ వెంటనే స్పందించి బ్రేక్‌ వేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఐదుగురుకి స్వల్ప గాయాలయ్యాయి. ప్రయాణికులందరిని వేరే బస్సులో నెల్లూరుకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement