అన్నదాతల కోసం కార్పొరేట్ సంస్థల సహకారంతో ముందుకు సెప్టెంబర్ 1న ప్రారంభం
పెలైట్ ప్రాజెక్ట్గా తుమకూరు జిల్లాలో తొలి దశలో 40 వేల రైతు కుటుంబాలకు లబ్ధి
బెంగళూరు :రాష్ట్రంలో కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు కార్పొరేట్ సంస్థల సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోంది. సీఎస్ఆర్(కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ) నిధులను అన్నదాతలను ఆదుకునేందుకు వినియోగించుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం పెలైట్ ప్రాతిపదికన తుమకూరు జిల్లాలో వచ్చేనెల 1 నుంచి ‘రైతు రక్ష’ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రంలో వివిధ కారణాల వల్ల ఇటీవల రైతుల బలవన్మరణాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. వీటికి అడ్డుకట్ట వేయడంతో పాటు రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా తుమకూరు, శిరా, పావగడ తాలూకాల్లో దాదాపు 40 వేల రైతు కుటుంబాలను ఎంపిక చేయనుంది. ఒక్కొక్క కుటుంబానికి వేర్వేరు నేపథ్యం ఉంటుంది. అందువల్ల తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఒక్కొక్క రైతు కుటుంబానికి కార్పొరేట్ సంస్థల సీఎస్ఆర్ నిధుల నుంచి రూ.10 వేల నుంచి గరిష్టంగా రూ.20 వేల వరకు సహాయధనాన్ని అందజేస్తారు.
అటుపై రాష్ట్ర పశు సంవర్ధకశాఖ, మత్స్యశాఖ, ఉద్యానశాఖల సంయుక్త సహకారంతో వర్మీకంపోస్ట్ ఎరువు, పుట్టుగొడుగుల పెంపంకం, మేకలు, గొర్రెల పెంపకం వంటి వ్యవసాయ ఆధారిత పనులను చేపట్టడానికి వీలుగా రుణాలను అందజేస్తారు. ఆయా కుటుంబ నేపథ్యం సభ్యుల ఆసక్తిని అనుసరించి పనులను కేటాయిస్తారు. మొత్తంగా సీఎస్ఆర్ నిధులను ప్రభుత్వ పథకాలకు తోడుగా రైతు రక్ష పథకం కింద దయనీయ స్థితిలో ఉన్న అన్నదాతలకు అందించి మూడేళ్లలోపు వారిని ఆర్థికంగా గట్టెంక్కించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏడాది పాటు ఈ జిల్లాలో రైతు రక్షను అమలు చేసి అటు పై రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకూ ఈ పథకాన్ని విస్తరించే ఆలోచన ఉన్నట్లు తుమకూరు జిల్లా ఇన్ఛార్జ్ కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ షాలినీ రజినీష్ తెలిపారు.
Related news
-
వృద్ధికి కార్పొరేట్ పెట్టుబడుల దన్ను
ముంబై: కార్పొరేట్ రంగం తాజా మూలధన వ్యయాలు తదుపరి దశ వృద్ధికి దోహదపడే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ‘స్టేట్ ఆఫ్ ది ఎకానమీ’ శీర్షికన రూపొందించిన తాజా బులెటిన్ పేర్కొంది. స్థిరంగా, 4 శాతం వద్ద తక్కువ ద్రవ్యోల్బణం జీడీపీ పురోగమనానికి కీలక అంశంగా ఉంటుందని వివరించింది. 2024లో గ్లోబల్ ఎకానమీ ఊహించిన దానికంటే బలమైన వృద్ధిని ప్రదర్శించే అవకాశం ఉందని పేర్కొంది. సవాళ్లు ఉన్నప్పటికీ, సానుకూలతలో వాటిని సమతౌల్యం చేస్తున్నట్లు వివరించింది. భారత ఆరి్థక వ్యవస్థ 2023–24 ప్రథమార్థంలో మంచి పురోగతి సాధించిందని, ఇదే ధోరణిని ఇప్పటికీ కొనసాగిస్తోందని పేర్కొంది. మొత్తంమీద, ప్రైవేట్ కార్పొరేట్ రంగం పెట్టుబడి ధోరణులు ఈ సంవత్సరం ఇప్పటివరకు సానుకూలంగా ఉన్నాయని తెలిపింది. 2023 ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో ప్రధాన బ్యాంకులు, ఆరి్థక సంస్థలు (ఎఫ్ఐ) రుణాలు మంజూరు చేసిన ప్రాజెక్ట్ల మొత్తం వ్యయం రూ. 2.4 లక్షల కోట్లని పేర్కొంటూ, ఇది వార్షికంగా 23 శాతంకంటే ఎక్కువని తెలిపింది. ప్రస్తుత ఆరి్థక సంవత్సరం రెండవ, మూడవ త్రైమాసికాల్లో మూలదన పెట్టుబడులు, పబ్లిక్ ఆఫర్లు, వాణిజ్య రుణ సేకరణలు.. ఎకానమీ సానుకూలతలను ప్రతిబింబిస్తున్నట్లు పేర్కొంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం వార్షిక సగటును 4.5 శాతంగా పేర్కొంది. బులెటిన్ కథనంలో వ్యక్తీకరించబడిన అభిప్రాయాలు సంబంధిత రచయితలవితప్ప భారతీయ రిజర్వ్ బ్యాంక్ అభిప్రాయాలుగా భావించరాదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని బృందం ఈ బులెటిన్ను రూపొందించింది. భారత్ రుణ–జీడీపీ నిష్పత్తిపై ఐఎంఎఫ్ వాదనలు సరికాదు... ఇదిలావుండగా, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని బృందం రచించిన మరో ఆరి్టకల్ భారత్ రుణ–జీడీపీ నిష్పత్తిపై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అభిప్రాయాలను త్రోసిపుచి్చంది. రుణ–జీడీపీ నిష్పత్తి అంచనా వేసిన దానికంటే గణనీయంగా తక్కువగా ఉండవచ్చని ఉద్ఘాటించింది. ‘‘ఈ సందర్భంలో తీవ్ర పరిస్థితులు ఏదైనా సంభవిస్తే... భారతదేశ సాధారణ ప్రభుత్వ రుణం జీడీపీలో మధ్య కాలికంగా 100 శాతం మించిపోతుందన్న ఐఎంఎఫ్ వాదనను మేము తిరస్కరిస్తున్నాము’’ అని ఆర్టికర్ పేర్కొంది. 2030–31 నాటికి ప్రభుత్వ సాధారణ రుణ–జీడీపీ నిష్పత్తి 78.2 శాతం ఉంటుందని ఐఎంఎఫ్ అంచనావేయగా, ఐదు శాతం తక్కువగా 73.4 శాతానికి పరిమితం అవుతుందని ఆర్టికల్ పేర్కొంది. ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు సంబంధించి నికర వ్యత్యాసం ద్రవ్యలోటును భారత్ పటిష్ట రీతిలో కట్టడి చేయగలుగుతున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. 2024–25లో వృద్ధి 7 శాతం: ఆరి్థకశాఖ కాగా, భారత ఆర్థిక వ్యవస్థ అవుట్లుక్ ప్రకాశవంతంగా’ కనిపిస్తుందని, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు వచ్చే ఆరి్థక సంవత్సరంలో 7 శాతం వృద్ధి రేటును నమోదు చేసే అవకాశం ఉందని ఆరి్థకశాఖ నెలవారీ ఆరి్థక సమీక్షా నివేదిక పేర్కొంది. భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు– అంతర్జాతీయ ఆరి్థక మార్కెట్లలో అస్థిరత నుండి ప్రతికూలతలపై దేశం నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని నివేదిక ఉద్ఘాటించింది. గృహ వినియోగం మెరుగుపడుతుందని నివేదిక అంచనా వేసింది. ప్రైవేటు రంగంలో తిరిగి పెరుగుతున్న పెట్టుబడులు, మెరుగైన వ్యాపార సెంటిమెంట్లు, బ్యాంకులు– కార్పొరేట్ల ఆరోగ్యకరమైన బ్యాలెన్స్ షీట్లు, మూలధన వ్యయం పెంపునకు ప్రభుత్వ నిరంతర ప్రయత్నం ఎకానమీని సుస్థిరంగా నడుపుతోందని నివేదిక పేర్కొంది. ప్రపంచ వాణిజ్యం మెరుగుపడ్డం, సరఫరాల చైన్ స్థిరీకరణ అంతర్జాతీయ డిమాండ్ పురోగమనానికి దారితీసే అంశాలని వివరించింది. -
AGWA: నీ జీవితానికి నువ్వే కథానాయిక
జీవితంలో ఎదురయ్యే అనుభవాలను పాఠాలుగా నేర్చుకుని మరోసారి పొరపాట్లు చేయకుండా సమస్యల సుడిగుండాల్ని అధిగమిస్తుంటారు చాలామంది. శుభాపాండియన్ కూడా సమస్యల నుంచి బయట పడేందుకు చాలానే కష్టపడింది. తన జీవితంలో నేర్చుకున్న పాఠాలను మరికొందరి జీవితాలకు అన్వయించి వారి జీవితాలను సుఖమయం చేస్తోంది. తనతోపాటు వేలమంది మహిళలను చేర్చుకుని ఎంతో మందికి చేయూతనిస్తోంది. మధురైలో పుట్టిపెరిగిన శుభా పాండియన్ పెళ్లయ్యాక చెన్నై వచ్చింది. బీకామ్ చదివిన శుభా చెన్నై నగరంలో ఎన్నో ఆశలు, కలలతో అడుగుపెట్టింది. ఇంగ్లిష్ రాదు. ఎటువంటి ఉద్యోగానుభవం లేదు. కానీ ఎలాగైనా ఎదగాలన్న తపన ఉంది. చెన్నై వచ్చిన ఏడాదిలోపే భర్త మరణం శుభాను రోడ్డున పడేసింది. పసిగుడ్డును పోషించుకునే భారం తనమీదే పడడంతో కష్టం మీద చిన్న ఉద్యోగం వెతుక్కుంది. ఒంటరి తల్లిగా అనేక అవమానాలు, కష్టాలు ఎదుర్కొంటోన్న శుభాకు తోటి మహిళా ఉద్యోగులు అండగా నిలబడి మానసిక ధైర్యాన్ని ఇచ్చారు. దీంతో కార్పొరేట్ సెక్టార్లో తనకంటూ ఒకస్థానాన్ని ఏర్పరచుకుని ఉద్యోగిగా నిలదొక్కుకుంది. ఆగ్వా... అనేక సమస్యలతో జీవితాన్ని నెట్టుకొస్తున్న శుభకు తోటి మహిళలు ఇచ్చిన ప్రోత్సాహం ఎంతో ప్రేరణ ఇచ్చింది. ఈ ప్రేరణతోనే తనలాగా ఒంటరిగా బాధపడుతోన్న ఎంతోమంది మహిళలకు చేయూతనిచ్చేందుకు కొంతమంది మహిళల సాయంతో 2008లో ‘ఆగ్వా’ పేరిట నెట్వర్క్ను ఏర్పాటు చేసింది. సాయంకోసం ఎదురు చూస్తున్న వారికి సాయమందిస్తూ, వారిని మానసికంగా దృఢపరిచి, ఆర్థికంగా ఎదిగేందుకు శిక్షణ ఇప్పించి నిస్సహాయ మహిళలకు అండగా నిలబడింది. గృహహింసా బాధితులను ఆదుకోవడం, ‘క్యాంపస్ టు కార్పొరేట్’ పేరిట ఉద్యోగాల్లో ఉన్నతంగా రాణించేందుకు మెళకువలు నేర్పించడం, అల్పాదాయ మహిళలను ఒకచోటకు చేర్చి వారితో చిన్నచిన్న వ్యాపారాలు చేయించడం, కుట్టుమిషన్లు, వెట్గ్రైండర్స్ ఇప్పించి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు దోహదపడడం, కంప్యూటర్ స్కిల్స్ నేర్పించడం, టైలరింగ్, పేపర్ బ్యాగ్ల తయారీ వంటి వాటిద్వారా ఆగ్వా ప్రారంభించిన ఐదేళ్లల్లో్లనే ఎనిమిదివేలకుపైగా మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు చేయూతనిచ్చింది. కేవలం పన్నెండు మందితో ప్రారంభమైన ఆగ్వా క్రమంగా పెరుగుతూ నేడు తొమ్మిదివేల మందికి పైగా మహిళలతో పెద్దనెట్వర్క్గా విస్తరించింది. మహిళాసాధికారత.. గిఫ్టింగ్ స్మైల్స్ ఆగ్వా నెట్వర్క్ 2016 నుంచి ఇప్పటిదాకా కష్టాలలో ఉన్న మహిళలకు మానసిక బలాన్నిచ్చి వారి కాళ్లపై వారిని నిలబెట్టేందుకు 31 కాన్ఫరెన్స్లు, 270 ఉచిత వెబినార్లు నిర్వహించి ఇరవై ఏడు వేలమంది మహిళలకు పరోక్షంగా దారి చూపింది. ఇవేగాక ఫుడ్ బ్యాంక్లకు ఆహారం అందించడం, పర్యావరణ సంరక్షణ కార్యక్రమాలు చేపట్టడం, పిల్లల ఆటవస్తువులు, పుస్తకాలు, స్వీట్లు, కలర్ బాక్స్లు, షూస్, విరాళాలు సేకరించి చెన్నై వ్యాప్తంగా ఉన్న నిరుపేద పిల్లలకు అందించింది. ప్రారంభంలో మహిళాభ్యున్నతికోసం ఏర్పాటైన ఈ నెట్వర్క్ నేడు దేశవ్యాప్తంగా ఉన్న వందలమంది వలంటీర్లు, సామాజిక వేత్తలతో కలసి వివిధ రకాల సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కెరీర్లో ఎదుగుతూనే... శుభా తన కెరీర్లో ఎదుగుతూనే ఆగ్వాను సమర్థంగా నడిపించడం విశేషం. బహుళ జాతి కంపెనీలైన.. కాగ్నిజెంట్, అవీవా, సీఎస్ఎస్, డియా సెల్యూలార్ వంటి పెద్ద కంపెనీలలో ఉన్నతస్థాయి పదవుల్లో పనిచేసింది. ఈ అనుభవంతో మరింత మందిని కార్పొరేట్ కెరీర్లో ఎదిగేందుకు ప్రొఫెషనల్ లీడర్షిప్ ప్రోగ్రామ్లు నిర్వహించి, ఎంతో మందిని కార్పొరేట్ వృత్తినిపుణులుగా తీర్చిదిద్దుతోంది. ఈ ప్రోగ్రామ్లో మహిళలేగాక, దివ్యాంగులు, ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి చెందిన వారు కూడా ఉండడం విశేషం. ఏదైనా సాధించగలవు ఈ ప్రకృతిలో నీటికి చాలా శక్తి ఉంది. మహిళ కూడా నీరులాంటిది. నీరు ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారాన్ని సంతరించుకుని తన శక్తిని పుంజుకుంటుంది. అందుకే స్పానిష్ పదం ఆగ్వా అనే పేరును నా నెట్వర్క్కి పెట్టాను. మా నెట్ వర్క్లో 25 నుంచి 73 ఏళ్ల వయసు మహిళలంతా కలిసి పనిచేస్తున్నాం. వివిధ వృత్తి వ్యాపారాల్లో రాణిస్తోన్న వీరంతా నెట్వర్క్లో పనిచేస్తూ ఎంతో మందికి సాయం అదిస్తున్నారు. ఆగ్వా ఉమెన్ ఫౌండేషన్, అగ్వా ఉమెన్ లీడర్ షిప్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మా నెట్వర్క్ను విస్తరించాం. మనకుంది ఒకటే జీవితం. దానిని పూర్తిగా జీవించాలి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావనేది అనవసరం. నీ కథను నువ్వే రాసుకునే శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నాయి. నీ జీవితానికి నువ్వే హీరోయి¯Œ వని ఎప్పుడూ మర్చిపోకూడదు. అప్పుడే ఏదైనా సాధించగలవు. – శుభా పాండియన్ -
ఇక్కడ చికెన్ చీప్ గురూ!
సాక్షి, కామారెడ్డి: పౌల్ట్రీ రంగంలో కార్పొరేట్ సంస్థలు ఎంత పోటీ పడినా, ధర విషయంలో మాత్రం కలిసే నిర్ణయిస్తాయి. వాళ్లు చెప్పిన ధరే చెల్లుబాటవుతుంది. రోజూ లైవ్ బర్డ్, డ్రెస్స్డ్ చికెన్, స్కిన్లెస్ చికెన్ ధరలను నిర్ణయించి పత్రికల ద్వారా వెల్లడిస్తారు. ఆ రేట్ల ప్రకారమే రాష్ట్రమంతటా విక్రయాలు జరుగుతాయి. కానీ కామారెడ్డి మార్కెట్లో ఎక్కడికి వెళ్లినా ‘ఈ రోజు పేపర్ రేటుపై కిలోకు రూ. 30 తక్కువ’అన్న ఫ్లెక్సీలు దర్శనమిస్తాయి. ఒక్కోసారి తక్కువ ధరతో పాటు పలు ఆఫర్లు కూడా ప్రకటిస్తుంటారు. కిలో చికెన్ కొంటే ఆరు కోడిగుడ్లు ఉచితంగా ఇస్తుంటారు. రూ. 30 నుంచి రూ. 50 వరకు తగ్గింపు.. కామారెడ్డి పట్టణంలో హోల్సెల్ చికెన్ సెంటర్లు దాదాపు 40 ఉండగా, రిటైల్ దుకాణాలు వందకు పైగా ఉన్నాయి. కామారెడ్డి మినహా మిగతా పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాలకు వెళ్తే పత్రిక ధర ప్రకారమే చికెన్ విక్రయాలు సాగుతాయి. కొన్ని చోట్ల పేపర్ ధర కన్నా కొంత ఎక్కువకే అమ్ముతారు. కామారెడ్డిలోని చికెన్ వ్యాపారులు మాత్రం ధర తగ్గించుకుని విక్రయిస్తున్నారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు సంబంధించి ఎక్కువ మొత్తంలో కొంటే కిలోకు రూ.30 నుంచి రూ.50 వరకు తగ్గింపు ఇస్తున్నారు. కామారెడ్డికి చెందిన చికెన్ వ్యాపారి ఒకరు ఇటీవల సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మూడు బ్రాంచ్లను తెరిచి, పేపర్ ధరపై రూ.30 తగ్గిస్తున్నట్లు ఫ్లెక్సీలు కట్టారు. ఏళ్ల తరబడిగా చికెన్ వ్యాపారం చేస్తున్న సిరిసిల్ల వ్యాపారులు ఈ ఫ్లెక్సీలను చూసి ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. నాలుగైదేళ్లుగా ఇదే పోటీ.. కామారెడ్డి పట్టణంలో గడచిన నాలుగైదేళ్లుగా ఈ పోటీ నెలకొంది. ఒకరిని చూసి ఒకరు అన్నట్టుగా అందరూ తగ్గింపు ధరలకే ఇస్తున్నారు. ఇటీవల కామారెడ్డిలో కొత్తగా ఓ బ్రాంచ్ తెరిచిన చికెన్ వ్యాపారి.. తగ్గింపు ధరతో పాటు కిలో చికెన్ కొంటే అర డజను కోడిగుడ్లు ఉచితంగా అందించాడు. మరో వ్యాపారి పత్రిక ధరపై కిలోకు రూ.35 తక్కువ అన్న బోర్డు పెట్టాడు. శనివారం రాష్ట్రంలో డ్రెస్స్డ్ చికెన్ ధర కిలోకు రూ.220 ఉండగా, కామారెడ్డిలో రూ.180కి విక్రయించారు. అంటే కిలోకు రూ.40 వరకు తగ్గించారు. కొన్ని చోట్ల కిలో ధర రూ.170కి కూడా అమ్మారు. అయితే కొందరు బడా వ్యాపారుల జిమ్మిక్కులతో చిరు వ్యాపారులు నలిగిపోతున్నారు. పెద్ద ఎత్తున అమ్మకాలు.. కామారెడ్డి జిల్లా కేంద్రంలో చికెన్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఆదివారం రోజైతే టన్నుల కొద్దీ విక్రయాలు సాగుతాయి. రోజూ హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లకు ఆర్డర్పై సరఫరా చేస్తుంటారు. అలాగే ఫంక్షన్లు, పండుగలు, పెళ్లిళ్లకు పెద్ద ఎత్తున చికెన్ సరఫరా చేస్తారు. కొందరు వ్యాపారులైతే ఎక్కువ మొత్తంలో చికెన్ ఆర్డర్ చేస్తే డోర్ డెలివరీ కూడా చేస్తారు. కామారెడ్డికి చుట్టుపక్కల గ్రామాలు, ఇతర పట్టణాల నుంచి కూడా చికెన్ కోసం వస్తారు. పొరుగునే ఉన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాల్లోని సమీప గ్రామాలతో పాటు కామారెడ్డి జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువ మొత్తంలో చికెన్ అవసరం ఉంటే కామారెడ్డికి వచ్చి కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం శ్రావణమాసం కావడంతో అమ్మకాలు కొంత తగ్గాయి. -
ప్రథమార్ధంలో డీల్స్ జోరు
న్యూఢిల్లీ: కోవిడ్–19 సెకండ్ వేవ్ ప్రభావాలు భారత్లో ఎలా ఉన్నప్పటికీ కార్పొరేట్ రంగంలో డీల్స్ జోరు కొనసాగుతోంది. ఈ ఏడాది ప్రథమార్ధంలో దాదాపు 41 బిలియన్ డాలర్ల విలువ చేసే ఒప్పందాలు కుదరడం ఇందుకు నిదర్శనం. కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ ఇండియా నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం జనవరి 1 నుంచి జూన్ 15 మధ్య కాలంలో దేశీ సంస్థలు 710 లావాదేవీలకు సంబంధించి 40.7 బిలియన్ డాలర్ల విలువ చేసే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. విలువపరంగా గతేడాది ద్వితీయార్ధంతో పోలిస్తే ఇది రెండు శాతం అధికం. జనవరి–జూన్ మధ్య కాలంలో ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) లావాదేవీలు ఆల్టైమ్ గరిష్టమైన 26.3 బిలియన్ డాలర్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంతో పోలిస్తే ఇది 25 శాతం ఎక్కువ. బిలియన్ డాలర్ల స్థాయి కొనుగోళ్లు, స్టార్టప్లు పలు విడతలుగా నిధులు సమీకరించడం తదితర అంశాలు .. డీల్స్ జోరుకు దోహదపడ్డాయి. అనిశ్చితి నెలకొన్న ప్రస్తుత తరుణంలో డిజిటల్ .. టెక్నాలజీ విభాగంలోనూ, పర్యావరణ..సామాజిక..గవర్నెన్స్ (ఈఎస్జీ) విభాగంలోనూ పెట్టుబడులు గణనీయంగా వస్తున్నాయని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్నర్ దినేష్ ఆరోరా తెలిపారు. ఇతర విశేషాలు.. ► ప్రథమార్ధంలో 6.2 బిలియన్ డాలర్ల విలువ చేసే విలీన, కొనుగోళ్ల (ఎంఅండ్ఏ) ఒప్పందాలు కుదిరాయి. ► అదానీ గ్రీన్ ఎనర్జీ సుమారు 3.5 బిలియన్ డాలర్లకు ఎస్బీ ఎనర్జీ ఇండియాను, ఐటీ దిగ్గజం విప్రో దాదాపు 1.45 బిలియన్ డాలర్లు పెట్టి బ్రిటన్కు చెందిన క్యాప్కోను కొనుగోలు చేశాయి. ► ఇవి కాకుండా విదేశాలకు చెందిన సంస్థల కొనుగోళ్లకు సంబంధించి 26 డీల్స్ కుదిరాయి. వీటి విలువ 385 మిలియన్ డాలర్లు. ► టెక్నాలజీ రంగంలో పీఈ పెట్టుబడులు అత్యధికంగా వచ్చాయి. ► 2021లో 16 స్టార్టప్లు..యూనికార్న్ (1 బిలియన్ డాలర్ల విలువ చేసే సంస్థలు) క్లబ్లో చేరాయి. -
దివాలా చర్యలకు 6 నెలల బ్రేక్!
న్యూఢిల్లీ : కరోనా కష్ట కాలంలో కార్పొరేట్ రుణ గ్రహీతలకు పెద్ద ఉపశమనం కల్పించే విధంగా దివాలా చట్టానికి సవరణలను కేంద్రం తీసుకురానుంది. కంపెనీలు తీసుకున్న రుణాలకు చెల్లింపులు చేయకపోతే దివాలా అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) చట్టంలోని నిబంధనల ప్రకారం నిర్ణీత కాలం తర్వాత అంటే 90 రోజుల అనంతరం ఎన్పీఏగా గుర్తించి దివాలా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే, లౌక్డౌన్ నేపథ్యంలో చాలా కంపెనీలు పనిచేసే అవకాశం లేదు. ఈ ప్రభావం చాలా కాలం పాటు కంపెనీలపై ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో.. కంపెనీలపై దివాలా చర్యలకు వీలు కల్పించే చట్టంలోని సెక్షన్ 7, 9, 10ను కొంతకాలం పాటు సస్పెండ్ చేసే విధంగా చట్టంలో కేంద్రం సవరణలు తీసుకురానున్నట్టు అధికార వర్గాల సమాచారం. దీంతో చెల్లింపులు చేయలేని కంపెనీల రుణాలను పునరుద్ధరించే వీలు బ్యాంకులకు ఏర్పడుతుంది. తొలుత ఆరు నెలల కాలానికి ఈ నిబంధనలను సస్పెండ్ చేసి, తర్వాత పరిస్థితులకు అనుగుణంగా మరో ఆరు నెలలు పొడిగించే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నాయి. ప్రస్తుతానికి కార్పొరేట్ రుణాల పునరుద్ధరణకు ఆర్బీఐ నిబంధనలు అనుమతించడం లేదు. దీంతో చెల్లింపుల్లో విఫలమైతే ఐబీసీ చట్టం కింద ఆయా రుణ ఖాతాల విషయంలో బ్యాంకులు చర్యలు తీసుకోవాల్సి వస్తోంది. లాక్డౌన్లో జాప్యాన్ని డిఫాల్ట్గా చూడవద్దు: సెబీ మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు కలిగి ఉన్న మనీ మార్కెట్, డెట్ సెక్యూరిటీలకు సంబంధించి లాక్డౌన్ కాలంలో అసలు, వడ్డీ చెల్లింపులు, కాల వ్యవధి పొడిగింపులను డిఫాల్ట్గా పరిగణించవద్దని వ్యాల్యుషన్ ఏజెన్సీలను సెబీ కోరింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్నందున మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు సెబీ దృష్టికి రావడంతో ఈ పరిణామం జరిగింది. మరోవైపు రుణ చెల్లింపులపై మూడు నెలల మారటోరియంకు ఆర్బీఐ అనుమతించడం తెలిసిందే.
Related News by category
-
నేడు రాయదుర్గం వైఎస్సార్సీపీ ఆత్మీయ భేటీ
బనశంకరి: ఆంధ్రప్రదేశ్లో లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయఢంకా మోగించడమే లక్ష్యంగా పార్టీ ఐటీ వింగ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ దిశగా అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డికి మద్దతుగా బెంగళూరులో నివాసం ఉండే రాయదుర్గం ప్రజలతో ఈనె 20వ తేదీ శనివారం బెంగళూరులో ఐటీ వింగ్ ఆత్మీయ సమావేశం నిర్వహిస్తోంది. సుంకదకట్టెలో పీ అండ్ టీ లేఔట్లో మాగడి రోడ్డు శివనంది కన్వెన్షన్ హాల్లో ఉదయం 10 గంటలకు సమావేశం ఆరంభమవుతుంది. ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని ఐటీ వింగ్ తెలిపింది. హాజయ్యేవారు ఈ లింక్లో https://-docs.googl.com/forms/d/e/1FAlpQLScSNUBRFOiOeQ6Yxaoqvcdnhxtjey9oBLcqW5BT-UsBmt2Q4A/viewform లో రిజిస్టర్ చేసుకోవాలి. మరిన్ని వివరాలకు ముచ్చుమర్రి రాకేశ్రెడ్డి–6302989417 , శరన్– 7893830381, రాజశేఖర్రెడ్డి– 9703518965 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. -
పలు ప్రాంతాలకు వర్ష సూచన
బనశంకరి: వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. బెంగళూరు నగర, గ్రామాంతర, దక్షిణకన్నడ, గుల్బర్గా, రాయచూరు జిల్లాల్లో కొద్ది గంటల్లో వర్షం కురుస్తుందని భారతీయ వాతావరణశాఖ వెల్లడించింది. ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. మూడు చెరువుల పునరుద్ధరణబనశంకరి: రెండు నెలలుగా బెంగళూరు నగరంలో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చడంతో ప్రజల దప్పిక తీర్చేందుకు రాయల్ చాలెంజర్స్ నడుం బిగించింది. ఇందులో భాగంగా మూడు చెరువులను అభివృద్ధి చేసింది. ఇండియా కేర్స్ ఫౌండేషన్తో కలిసి 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఇట్టిగల్పుర, సాదేనహళ్లి, కణ్ణూరు చెరువుల్లో పూడిక తొలగించారు. ఇట్టిగల్పుర, సాదేనహళ్లి చెరువులనుంచి సుమారు 1.2 లక్షటన్నుల పూడికను తొలగించారు. పూడిక మట్టిని 52 మంది రైతులు తమ పొలాలకు తరలించారు. చెరువుల్లో పూడిక తొలగించడంతో 17 ఎకరాల మేర నిల్వ ఉంటుంది. కణ్ణూరుచెరువు చుట్టూ ఔషధమొక్కలు, వెదురు ఉద్యానవనం నిర్మించినట్లు ఆర్సీబీ తెలిపింది. 24 నుంచి నిషేధాజ్ఞలు మైసూరు : ఎన్నికల నేపథ్యంలో ఈనెల 24న సాయంత్రం ఆరు గంటలనుంచి 26వ తేదీ రాత్రి 10 గంటల వరకు మైసూరులోని 200 పోలింగ్ కేంద్రాల చుట్టూ 200 మీటర్ల వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని నగర పోలీసు కమిషనర్ బీ రమేష్ శుక్రవారం తెలిపారు. నగరంలో ఐదుగురుకంటే ఎక్కువ మంది గుంపులుగా ఉండరాదన్నారు. ఊరేగింపులు, సభలు, ధర్నాలు నిషేధించినట్లు తెలిపారు. -
నేడు ప్రధాని మోదీ రాక
సాక్షి బెంగళూరు: బెంగళూరులోని వివిధ లోక్సభ నియోజకవర్గాలు, గ్రామీణ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం కోసం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వస్తుండడంతో కార్యకర్తల్లో, ఓటర్లలో కొత్త ఉత్సాహం వచ్చిందని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీవై విజయేంద్ర తెలిపారు. నరేంద్ర మోదీ కార్యక్రమం శనివారం బెంగళూరు ప్యాలెస్ మైదానంలోని విహార్గేట్లో జరగనుందని తెలిపారు. శుక్రవారం ప్యాలెస్ మైదానంలో ప్రధాని కార్యక్రమ ఏర్పాట్లను విజయేంద్ర పరిశీలించి ఆ తర్వాత జరిగిన ప్రధాని భారీ బహిరంగ సభ కర్టన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో విజయేంద్ర మాట్లాడుతూ చిక్కబళ్లాపుర కార్యక్రమం తర్వాత బెంగళూరులో ప్రధాని మోదీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. మొత్తం 60 వేల మంది కూర్చొనేలా సీట్లను ఏర్పాటు చేసినట్లు, మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. హుబ్లీలో జరిగిన ఘటన కేవలం వ్యక్తిగత కారణాలతో జరిగినట్లు సీఎం, హోం మంత్రి చెప్పడం శోచనీయమని, దేశద్రోహులకు రక్షణ కలిగించేలా వారు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం ఒక్కరోజే 8 హత్య కేసులు నమోదు అయ్యాయని, ఇలా నేరాలు రాష్ట్రంలో పరిపాటిగా మారిపోయాయని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. బెంగళూరు, చిక్కబళ్లాపురంలో బహిరంగ సభలు ఓటర్లలో కొత్త ఉత్సాహం వచ్చిందన్న బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీవై విజయేంద్ర -
రైస్పుల్లింగ్ పేరుతో వంచన
బనశంకరి/కృష్ణరాజపుర: రైస్ పుల్లింగ్పేరుతో నకిలీ తామ్రపాత్ర చూపించి వంచనకు పాల్పడిన ముగ్గురు వంచకులకు బేడీలు పడ్డాయి. పంజాబ్కు చెందిన సన్నిగిల్, తమిళనాడువాసి రమేశ్, బెంగళూరు నగరనివాసి శివశంకర్ అనే నిందితులను శుక్రవారం జయనగరపోలీసులు అరెస్ట్చేశారు. వీరి వద్ద నుంచి రూ. 69.79 లక్షల నగదు, నకిలీ తామ్రపాత్రను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు జయనగర 6 వబ్లాక్ యడియూరుచెరువు వద్ద రైస్పుల్లింగ్ తామ్రపాత్ర విక్రయిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. శుక్రవారం జయనగర పోలీసులు దాడిచేసి నిందితులను అరెస్ట్చేశారు. అనంతరం వారిని కోర్టులో హజరుపరిచారు. నిందితులనుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని, తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. దీంతో వారిని 5 రోజులపాటు కస్టడీకి ఆదేశిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. కాగా నిందితులు చాలా చోట్ల అనేక మందిని వంచించినట్లు పోలీసులు తెలిపారు. రూ.69.79 లక్షలు స్వాధీనం -
అర్ధరాత్రి మారణకాండ
సాక్షి బళ్లారి: గదగ్ నగరంలో గురువారం అర్ధరాత్రి మారణకాండ చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హత్యకు గురయ్యారు. హతులను నగరసభ ఉపాధ్యక్షురాలు సునంద బాకళె కుమారుడు కార్తీక్ బాకళె(27), పరశురామ (55), లక్ష్మీ (45), ఆకాంక్ష(16)గా గుర్తించారు. కుటుంబ సభ్యులు పైఅంతస్తులో గాఢ నిద్రలో ఉండగా దుండగులు చొరబడి వేట కొడవవళ్లతో విచక్షణా రహితంగా దాడి చేసి హత్యోదంతానికి పాల్పడ్డారు. గదిలో మృతదేహాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. రక్తం ఏరులై పారింది. దుండగుల బారి నుంచి తప్పించుకునేందుకు బాధితులు యత్నించగా వెంటాడి నరికినట్లుగా ఘటన స్థలంలో ఆనవాళ్లు కనిపించాయి. భీతావహంగా ఘటన స్థలం హత్య జరిగిన స్థలం రక్తం మడుగులతో భీతావహంగా ఉంది. ఇంటిలోని వస్తు సామగ్రి చెల్లాచెదురుగా పడి ఉంది. మహిళలు అనే కనికరం లేకుండా కొడవళ్లతో నరికి హత్య చేయడం నగరవాసులను కలవరపాటుకు గురి చేసింది. హంతకులు ఎవరు.. హత్యోదంతం కుటుంబ గొడవలతోనే జరిగినట్లు కొందరు చెబుతున్నారు. హంతకులు ఎవరు, ఏ ప్రాంతంనుంచి వచ్చారు..లోపలకు ఎలా చొరబడ్డారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ వీఎస్ నేమగౌడ ఆధ్వర్యంలో క్లూస్టీమ్, డాగ్ స్క్వాడ్తో సోదాలు నిర్వహించారు. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దుండగుల కోసం గాలింపు చేపట్టారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించి శుక్రవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. గదగ్లో దారుణహత్యలు ఒకే ఇంటిలో నలుగురు హతం మారణాయుధాలతో చెలరేగిన దుండగులు కుటుంబ కలహాలే హత్యలకు కారణమా? ఆ రాత్రి వెళ్లిపోయి ఉంటే.. సునంద ప్రకాష్ బాకళె కుమారుడు కార్తీక్ బాకళె(27) వివాహా నిశ్చితార్థానికి కొప్పళకు చెందిన పరుశురామ్(55), లక్ష్మి (45) దంపతులు తమ కుమార్తె ఆకాంక్ష(17)తో కలిసి వచ్చారు. 18వ తేదీ ఉదయం వివాహ నిశ్చితార్థ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంబరాలు ముగిసిన తర్వాత బంధువులు, మిత్రులు వారి వారి ప్రాంతాలకు తరలి వెళ్లగా పరుశురామ, లక్ష్మి, ఆకాంక్ష కొప్పళకు తిరిగి వచ్చేందుకు గురువారం రాత్రి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే బంధువుల ఒత్తిడితో కార్తీక్ బాకళె ఇంటిలోనే వారు బస చేశారు. కార్తీక్బాకళె(27)తో పాటు పైఅంతస్తులో నిద్రించారు. అర్ధరాత్రి జరిగిన హత్యోదంతంలో కార్తీక్ బాకళెతోపాటు పరశురామ, లక్ష్మి, ఆకాంక్షలు కూడా బలయ్యారు.
Advertisement
Photos
View allVideo
View allఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- Rishabh Pant: భారీ ప్రమాదం నుంచి మైదానం వరకు..
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement