సాక్షి, ముంబై: రాష్ట్రానికి శీతాకాల రాజధాని అయిన నాగపూర్లో ఉన్న బ్రిటిష్ కాలం నాటి సెంట్రల్ మ్యూజియం(అజబ్ బంగ్లా)కు మహర్దశ రానుంది. మ్యూజియం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.14 కోట్లు విడుదల చేసింది. నగర నడిబొడ్డున ఈ మ్యూజియం ఉంది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన సాంస్కృతిక శాఖ తరఫున ‘మ్యూజియం గ్రాండ్ స్కీం’ ద్వారా ఏటా భారత దేశంలోని మూడు మ్యూజియాలను ఎంపిక చేసి వాటి మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తారు.
ఆ మేరకు 2013 సెప్టెంబర్ 13న సాంస్కృతిక శాఖ నిపుణుల కమిటీ సమావేశం నిర్వహించింది. వీరు ఎంపిక చేసిన మూడు మ్యూజియంలలో నాగపూర్లోని సెంట్రల్ మ్యూజియం కూడా ఉంది. దీని మరమ్మతులకు రూ.14 కోట్ల నిధులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సదరు నిధులు మంజూరయినట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ నుంచి డెరైక్టర్కు ఇటీవల సమాచారమందింది. ఈ మ్యూజియంను 1857-1860 మధ్య కాలంలో అప్పటి జిల్లాధికారి సర్ రిచర్డ్ టెంపల్ నిర్మించారు. యాంటిక్ కలెక్షన్ సొసైటీ ద్వారా సేకరించిన దేశ, విదేశాలకు చెందిన అనేక అద్భుతమైన వస్తువులను ఇందులో ఉంచారు.
సిబ్బంది నిర్లక్ష్యంతో నిధుల లేఖ మాయం..
ఇదిలా ఉండగా అజబ్ బంగ్లా) మరమ్మతులకు నిధులు విడుదల చేస్తున్నట్లు ఆరు నెలల కిందట కేంద్రం పంపించిన లేఖ అదృశ్యమైంది. నిధులు మంజూరు విషయాన్ని 2013 డిసెంబర్ తొమ్మిదో తేదీన సాంస్కృతిక శాఖ కార్యదర్శి సంజయ్కుమార్కు అందిన లేఖను ఆయన మ్యూజియం బాధ్యుడు మధుకర్ కఠాణేకు పంపించారు. కాగా మ్యూజియం డెరైక్టర్కు ఈ లేఖకు సంబంధించిన సమాచారం లేకపోవడం గమనార్హం.
ఆరు నెలల నుంచి ఆ లేఖ విషయం తెలియని డెరైక్టర్కు నిధుల విడుదల విషయం తెలిసి అవాక్కయ్యారు. లేఖ గురించి మధుకర్ను ప్రశ్నించగా తనకు తెలియదని ఆయన దాటవేశాడు. ఇదిలా ఉండగా, మ్యూజియంను సందర్శించేందుకు కేంద్ర సాంస్కృతిక శాఖ బృందం త్వరలో రానుండటంతో ఇప్పుడు మ్యూజియం అధికారులందరూ ఆ లేఖ వేటలో పడ్డారు.
సెంట్రల్ మ్యూజియంకు మహర్దశ
Published Tue, May 27 2014 10:51 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement