'ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా ప్రకటించాలి' | Sakshi
Sakshi News home page

'ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా ప్రకటించాలి'

Published Tue, Nov 3 2015 7:10 PM

'ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా ప్రకటించాలి'

ఢిల్లీ: ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా ప్రకటించాలని కేంద్రాన్ని కోరినట్టు తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే ప్రాజెక్టు డిజైన్‌ నివేదిక ఇస్తామని అన్నారు.

అలాగే పత్తి మద్దతు ధర పెంచాలని కోరినట్టు తెలిపారు. తెలంగాణలో గోదాముల నిర్మాణానికి సహకరించాలని కేంద్రాన్ని కోరినట్టు హరీశ్‌రావు చెప్పారు.

Advertisement
Advertisement