రాయదుర్గంలో చిరుత కలకలం | Sakshi
Sakshi News home page

రాయదుర్గంలో చిరుత కలకలం

Published Thu, Aug 25 2016 3:02 PM

cheetah found in ananthpur district

రాయదుర్గం: అనంతపురం జిల్లా రాయదుర్గంలో గురువారం చిరుత కలకలం రేపింది. పట్టణంలోని మీసేవ సెంటర్ సమీపంలో చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. పట్టణంలో చిరుత తిరుగుతోందనే వార్త క్షణాల్లో పాకిపోవడంతో పట్టణ వాసులు భయాందోళనలకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.  
 

Advertisement
Advertisement