సాక్షి, ముంబై: నగర పౌరులు తమ సమస్యలపై ఫిర్యాదుచేయడానికి ఏర్పాటు చేసిన ఫిర్యాదు బాక్సులు అదృశ్యమౌతున్నాయి. నగర వాసులు తమ సమస్యలను సులభంగా ఫిర్యాదు చేయడానికి పోలీసులు ఏర్పాటు చేశారు. ఏర్పాటులో చూపిన శ్రద్ధ నిర్వహణలో చూపకపోవడంతో ఈ ప్రక్రియ ఆదిలోని విఫలమయింది. గత ఏడాది అక్టోబర్లో దాదాపు వెయ్యికి పైగా ఫిర్యాదు బాక్సులను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. అయితే ఇవి ఇప్పుడు ఎక్కడోకాని కనిపించకపోవడంతో పోలీసులు ఈ బాక్సులను మందుబాబులు దొంగిలించి ఉంటారని ఆరోపిస్తున్నారు.
హోం మంత్రి ఆర్ఆర్ పాటిల్, ముంబై కమిషనరు డాక్టర్ సత్యపాల్సింగ్లు 2012 అక్టోబర్లో దాదర్లోని రవీంద్ర నాట్య మందిర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఫిర్యాదుల విధానాన్ని ప్రారంభించారు. పౌరులు ఎదుర్కొంటున్న శాంతిభద్రతల సమస్యలను పోలీసుల దృష్టికి తేవడానికి సమాచార వారధిగా ఫిర్యాదు బాక్స్ల విధానం ప్రవేశపెట్టరు. ఈ సందర్భంగా వెయ్యి ఫిర్యాదు పెట్టెలను 96 పోలీస్ స్టేషన్ల పరిధిలో అమరుస్తున్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమం జరిగిన కొద్ది రోజుల్లోనే వీటి జాడ కనిపించకుండా పోయింది. సాధారణ ఫిర్యాదులే కాకుండా పోలీసుల మీద కూడా ఫిర్యాదులు చేయవచ్చని అధికారులు ప్రకటించారు. ఈ ఫిర్యాదుల పెట్టెలను తెరిచే అధికారం స్థానిక అధికారులకు కాకుండా సీఐడీ విభాగానికి అప్పగించారు. ప్రారంభించిన రెండు నెలల తర్వాత సీఐడీ విభాగం అధికారులు ఈ బాక్సులు తెరచి ఫిర్యాదులు స్వీకరించడానికి సరియైన సిబ్బంది తమ వద్దలేరని చేతులెత్తాశారు. దీంతో ఆర్భాటంగా ప్రారంభించిన పథకం పూర్తిగా మూలపడింది. కొద్ది రోజుల్లోనే ఎక్కడా ఫిర్యాదుల పెట్టె కనిపించని పరిస్థితి వచ్చింది.
హిందుజా కాలేజీ వద్ద విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి నెల రోజులపాటు ఫిర్యాదుల పెట్టెను కాలేజీ ఆవరణలో చూశానన్నారు. కాలేజీ ఆవరణలో తరచూ వేధింపుల సంఘటనలు చోటుచేసుకుంటున్నాయనీ, ముఖ్యంగా యువతులకు ఈ బాక్సు చాలా ఉపయోగకరంగా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. పేరు తెలియజేయకుండా ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉండడంతో ఫిర్యాదుదారుడిని నియంత్రించడానికి కూడా అవకాశంలేని ఈ విధానం పోలీసు వర్గాల అవినీతిని తూర్పార బట్టే సాధనమయ్యేది. అందుకే దీన్ని నిర్వహించాల్సిన సీఐడీ విభాగం శ్రద్ధ చూపకుండా వదలిపెట్టిందని ఓ సమాజిక కార్యకర్త ఒకరు విమర్శించారు.
ఫిర్యాదు బాక్సులు ఎక్కడా?
Published Wed, Nov 20 2013 11:06 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యులరాక
No Headline
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
తప్పక చదవండి
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement