కేసీఆర్ హామీలను నిలబెట్టుకోవాలి: భట్టి | Sakshi
Sakshi News home page

కేసీఆర్ హామీలను నిలబెట్టుకోవాలి: భట్టి

Published Mon, Nov 7 2016 7:10 PM

కేసీఆర్ హామీలను నిలబెట్టుకోవాలి: భట్టి - Sakshi

గోదావరిఖని : సింగరేణిలో పని చేసే కార్మికులకు ఒక్క రోజు సర్వీస్ ఉన్నా వారసత్వ ఉద్యోగాలను కల్పిస్తామంటూ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టుకోవాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.

సోమవారం గోదావరిఖనిలో ఆయన మాట్లాడుతూ హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మరిచిపోవడం కేసీఆర్‌కు పరిపాటిగా మారిందని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలోనే సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ప్రకటించారన్నారు. అందరు కార్మికుల పిల్లలకు ఎలాంటి షరతులు లేకుండా ఉద్యోగావకాశం కల్పించాలని ఆయన కోరారు. గుర్తింపు ఎన్నికల తర్వాత మోసం చేసే పరిస్థితి ఏర్పడనుందని, అందువల్ల టీఆర్‌ఎస్, టీబీజీకెఎస్ నాయకులు చెప్పే మాటలు విని ఉద్యోగులు మరోసారి మోసపోవద్దని భట్టి సూచించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement