ఒకే సారి రెండు చోట్ల దొరికిన బాంబులు రాష్ట్రంలో కలకలం సృష్టించాయి. కన్యాకుమారిలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఇంటి వద్ద 11 బాంబులు దొరికాయి. అలాగే మదురై జిల్లా మేలూరులో పేలుడు పదార్థాలను దాచి ఉంచిన ఇద్దరు అరెస్టయ్యారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి : కన్యాకుమారి జిల్లా కులచ్చల్ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సబీన్ (33) ఇంటికి ఆదివారం తెల్లవారుజాము 3 గంటల సమయంలో ఇద్దరు బైక్పై వచ్చి ఇంటి తలుపు తట్టారు. వారిని అనుమానించిన ఇరుగుపొరుగువారు మీరెవరని ప్రశ్నించగా చేపలు తెచ్చినట్లు బదులిచ్చారు. చేపలను ఇంటిముం దు పెట్టి వెళ్లండి వారు నిద్రలేచిన తరువాత తీసుకుంటారని స్థానికులు చెప్పడంతో వారి వెంట తెచ్చిన బకెట్ను అక్కడ పెట్టి వెళ్లిపోయారు. వారి కదలికలను అనుమానించిన స్థానికులు బకెట్ను తనిఖీ చేయగా అందులో 11 బాంబులను గుర్తించి భయభ్రాంతులకు గురయ్యారు.
పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని బాంబులను స్వాధీనం చేసుకున్నారు. కన్యాకుమారి జిల్లా ఎస్పీ మణివణ్ణన్ కులచ్చల్కు చేరుకుని కాంగ్రెస్ నేత సబీన్ తదితరులను విచారించారు. కొట్టిల్పాట్టికి చెందిన జేరోమ్, కులచ్చల్కు చెందిన డయానీని అరెస్ట్ చేశారు. జేరోమ్పై వరకట్న వేధింపుల కేసు కొనసాగుతుండగా, పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. కోర్టు అతనిపై పీటీ వారెంట్ జారీ చేసింది. తనపై కేసు బనాయించడంలో కాంగ్రెస్ అధ్యక్షులు సబీన్ ప్రోద్బలం ఉండొచ్చని అనుమానించి హతమార్చేందుకు కుట్రపన్నినట్లు పోలీసులు భావిస్తున్నారు.
పేలుడు పదార్థాలు స్వాధీనం-ఇద్దరు అరెస్ట్
శివగంగై జిల్లా ప్రాన్మలైలో సందేహాస్పదంగా కొందరు వ్యక్తులు తచ్చాడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. చెన్నై నుంచి ప్రత్యేక ఇంటెలిజన్స్ పోలీసు సూపరింటెండెంట్ శంకర్ బృందం మదురై సమీపంలోని మేలూరుకు చేరుకుంది. మేలూరులోని ముగమతియార్ పురానికి చెందిన మీరాన్ మైదీన్ కుమారుడు ముబారక్ (19), అబ్బాస్ (40)ను అదుపులోకి తీసుకుని రహస్య విచారణ జరిపారు. మదురైలో పేలుడు పదార్థాలను దాచి వుంచిన కేసులో ఇటీవల అరెస్టయిన సమ్సుద్దీన్తో సంబంధాలు ఉన్నట్లు వారు అంగీకరించారు. వీరిద్దరినీ ప్రాన్మలైకు తీసుకెళ్లగా 1500 ఏళ్ల నాటి శివుని ఆలయం, సమీపంలోని దర్గాకు మధ్యలో ఉన్న ఒక ప్రాంతంలో పేలుడు పదార్థాలు కనుగొన్నారు. పేలుడుకు ఉపయోగించే టైమర్, ముడి పదార్థాలు, స్పానర్, రంపం, ప్లాస్టిక్ కుళాయి తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
బాంబుల కలకలం
Published Mon, Mar 23 2015 2:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్
కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ
ఒక్క ఓటుతో ఏముందిలే అనుకుంటున్నారా..?
వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!
Lok Sabha Polls: మూడో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
క్రేజీ కాంబో.. సూపర్ ఛాన్స్ కొట్టేసిన అనుపమ
ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. బన్నీ ఎమోషనల్ పోస్ట్
మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!
ఇకపై రైలులో చార్ధామ్ యాత్ర!
తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement