= కేంద్రం, రాష్ర్టంలో ధృతరాష్ట్రుని పాలన
= మండిపడిన బీజేపీ యువమోర్చా ాష్ర్ట అధ్యక్షుడు మునిరాజ్
సాక్షి, బళ్లారి : యూపీఏ లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి కుంభకోణాల్లో మునిగిపోయిందని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ఓట్లు అడిగే కనీస అర్హత లేదని బీజేపీ యువ మోర్చా రాష్ర్ట అధ్యక్షుడు మునిరాజ్ పేర్కొన్నారు. నగరంలోని రాయల్ ఫోర్ట్ హోటల్లో యువమోర్చా ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఏ కుంభకోణం వెలుగు చూసినా యూపీఏ పాత్ర ఉండటంతో కాంగ్రెస్పై ప్రజలు విసిగిపోయారన్నారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మేలు చేయడంలో విఫలమైందన్నారు. రూపాయి కిలోబియ్యం ఇచ్చినంత మాత్రాన ఒరిగేదేమి లేదన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నా నియంత్రించలేని దుస్థితిలో సీఎం సిద్ధరామయ్య ఉన్నారన్నారు. కేంద్రంలోని యూపీఏ, రాష్ర్టంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్డిగా పాలన చేస్తున్నాయని మండిపడ్డారు. మైనార్టీల ఓట్ల కోసం షాదీ భాగ్య అమలు చేశారని మండిపడ్డారు.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అన్ని వర్గాలకూ ఈ పథకాన్ని వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేయడానికి కార్యకర్తలు శ్రమించాలన్నారు. రాష్ట్ర ఎస్టీ మోర్చా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే సోమలింగప్ప మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి స్వలాభం కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు.
బళ్లారి జిల్లాలో బీజేపీకి మంచి పట్టు ఉందని గుర్తు చేశారు. రాష్ట్ర బీజేపీ స్లం మోర్చా ఉపాధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ ఏఎం.సంజయ్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా బీజేపీ గాలులు వీస్తున్నాయన్నారు. అనంతరం జిల్లా బీజేపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నేమిరాజ్ నాయక్, జిల్లా బీజేపీ నాయకుడు రామలింగప్ప ప్రసంగించారు. నాయకులు మురారీగౌడ, సుధీర్, సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు శ్రీకనక దుర్గమ్మ ఆలయం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు.
యూపీఏ కుంభకోణాల మయం
Published Thu, Nov 28 2013 4:31 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రత్నగిరిపై కుండపోత
షెల్టర్ శ్లాబు కూలి యువకుడి మృతి
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
పిడుగు పడి మేకల కాపరి మృతి
జగన్తోనే సంక్షేమం
కోనసీమలో పలుచోట్ల అకాల వర్షం
హమ్మయ్య చల్లబడింది
IPl 2024: శాంసన్ ఇన్నింగ్స్ వృథా.. రాజస్తాన్పై ఢిల్లీ ఘన విజయం
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement