ముందుచూపు లేకనే ఆర్థిక ఎమర్జెన్సీ | Sakshi
Sakshi News home page

ముందుచూపు లేకనే ఆర్థిక ఎమర్జెన్సీ

Published Thu, Dec 22 2016 3:46 PM

cpi protest at indain bank at madan palli

మదనపల్లి: ప్రధాని నరేంద్రమోడీకి ముందు చూపు లేకపోవడంతోనే దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ నెలకొందని సీపీఐ నేతలు ఆరోపించారు. ఆ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం స్థానిక ఆర్టీసీ బస్టాండు సమీపంలోని ఇండియన్ బ్యాంకు ముందు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్బంగా సీపీఐ ఏరియా కార్యదర్శి కిష్టప్ప మాట్లాడుతూ నల్లధనాన్ని బయటపెట్టాలన్న ఉద్దేశ్యంతో మోదీ తీసుకున్న నిర్ణయాన్ని ఎవరైనా స్వాగతిస్తారని, అయితే ప్రత్యామ్నాయం లేకుండా చేసిన చర్యలను వ్యతిరేకిస్తున్నామన్నారు.

Advertisement
Advertisement