జైలు నుంచి వచ్చి ఇద్దరి హత్య | Sakshi
Sakshi News home page

జైలు నుంచి వచ్చి ఇద్దరి హత్య

Published Thu, May 18 2017 2:54 PM

జైలు నుంచి వచ్చి ఇద్దరి హత్య - Sakshi

న్యూఢిల్లీ: పెరోల్‌పై బయటకు వచ్చిన 17 ఏళ్ల బాలుడు తన నలుగురు స్నేహితుల సహాయంతో ఇద్దరిని హతమార్చిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. బాలల జైలు నుంచి బయటకు వచ్చిన వారం రోజులకే అతడీ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు. చిన్నచిన్న నేరాలకు పాల్పడి జైలుకు వచ్చిన ఈ బాలుడు గతంలో తనపై హత్యాయత్నం చేసిన సునీల్‌, రాహల్‌పై ప్రతీకారం తీర్చుకోవాలకున్నాడు. తన స్నేహితుల సాయంతో వారిద్దరినీ మట్టుబెట్టాడు.

పశ్చిమ ఢిల్లీలోని క్యాలా ప్రాంతంలో శుక్రవారం రాత్రి సునీల్‌ను బయటకు రప్పించి కత్తులతో పొడిచి చంపేశారు. తర్వాత అతడి మెడలోని బంగారపు గొలుసు తీసుకుని అక్కడి నుంచి పారిపోయారు. రెండు గంటల తర్వాత నబీ కరీం ప్రాంతంలో నివసిస్తున్న రాహుల్‌ను  ఇంటి నుంచి లాక్కెళ్లి దారుణంగా హత్య చేశారు. 20 సార్లు పైగా కత్తితో పొడవడటంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. బాలుడితో పాటు అతడికి సహకరించిన మనోజ్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు.

Advertisement
Advertisement