న్యూఢిల్లీ: దేశ రాజధాని ప్రజల నీటి కష్టాలను తీర్చడానికి ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వృథా నీటిని తిరిగి వాడుకునే విధానం అవలంభిస్తున్న సింగపూర్ను ఆదర్శంగా తీసుకోనుంది. వృథా నీటిని శుద్ధి చేసి తిరిగి ఉపయోగించే పద్ధతులను అధ్యయన ం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సోమవారం తెలిపారు. రాష్ట్రపతి భవన్లో సోమవారం జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవానికి కేజ్రీవాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడతూ వృథా నీటిని తిరిగి ఉపయోగించడంలో సింగపూర్ అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయడానికి కొన్ని బృందాలను పంపినట్టు తెలిపారు. ‘సింగపూర్కు స్వతహాగా నీటి వసతి లేదు. ఆ దేశానికి 95 శాతం నీరు బయటి నుంచే వస్తుంది.
ఆ నీటిని శుద్ధి చేసి తిరిగి ఉపయోగించే నూతన పద్ధతులకు సింగపూర్ శ్రీకారం చుట్టింది. దీని వల్ల బాత్రూం, వంటగదిలో ఉపయోగించే నీరు తిరిగి అక్కడే ఉపయోగించొచ్చు. ఈ విధంగా ఎక్కడ వాడుకున్న నీటిని అక్కడే వినియోగించేలా సింగపూర్ పద్ధతిని పరిశీలిస్తున్నాం. దీనిని పెలైట్ ప్రాజెక్టుగా తీసుకుని ఢిల్లీలో 10 నుంచి 15 ప్లాంట్లు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నాం. ఈ పద్ధతిలో వ్యర్థ నీటిని శుద్ధి చేసిన ప్పుడు అది పూర్తిగా మంచి నీటిలాగే మారుతుంది. మా ప్రయత్నాలు ఫలిస్తే ఢిల్లీలో నీటి సమస్య అసలు ఉండదు’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. అలాగే ఢిల్లీలో ఇప్పటికీ కేవలం 30 నుంచి 40 శాతం మంది మాత్రమే ఆస్తి పన్ను చెల్లిస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని కేజ్రీవాల్ చెప్పారు. ఆస్తి పన్ను చెల్లింపులను రాబట్టడం గురించి కూడా యోచిస్తున్నామన్నారు.
నీటి సమస్యకు సింగపూర్ మంత్రం
Published Tue, Mar 31 2015 3:47 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
Advertisement