ఢిల్లీలో 8 లక్షల నకిలీ ఓట్లు | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో 8 లక్షల నకిలీ ఓట్లు

Published Wed, Jan 7 2015 12:18 AM

Delhi has 8 lakh fake voters, claims Arvind Kejriwal

 న్యూఢిల్లీ: నగరంలో దాదాపు ఎనిమిది లక్షలమంది నకిలీ ఓటర్లు ఉన్నారని, ఇందులో బీజేపీ హస్తముందని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. 3,96,914 మంది ఓటర్లకు మొత్తం 11,50,509 ఓటరు కార్డులు ఉన్నాయని, దీంతో ఒక్కొక్క ఓటరుకు సగటున మూడు లేదా నాలుగు ఓటరు కార్డులు ఉన్నాయనే విషయం స్పష్టమవుతోందని అన్నారు. ఈ విషయమై ఢిల్లీ ఎన్నికల కమిషనర్ వీఎస్ సంపత్‌ను మంగ ళవారం కలసి ఫిర్యాదు చేశానన్నారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారని, ఈ విషయాన్ని పరిశీలిస్తానంటూ హామీ ఇచ్చారన్నారు. నకిలీ ఓటర్ల సంఖ్య అసాధారణంగా ఉందని, ఈ విషయంలో ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే విషయమై ఆ పార్టీ నేత అశుతోశ్ మాట్లాడుతూ దీని వెనుక బీజేపీ హస్తం ఉండొచ్చన్నారు.
 

Advertisement
Advertisement