ప్రపంచ బ్యాంకు రుణానికి సర్కారు ప్రతిపాదనలు
ప్రమాదాల సంఖ్య తగ్గించడమే లక్ష్యం
డమ్మీ ప్రమాద వాహనాల ఏర్పాటుకు రవాణా శాఖ నిర్ణయం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికంగా రోడ్డు ప్రమాదాలు విజయవాడ–విశాఖపట్నం మధ్యే జరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా చెన్నై–కోల్కతా జాతీయ రహదారి (ఎన్హెచ్–16)పై విజయవాడ నుంచి విశాఖ వరకు ప్రమాదాలు గణనీయంగా నమోదవుతున్నాయి. 2015లో 23,718 రోడ్డు ప్రమాదాలు నమోదైతే, విజయవాడ–విశాఖ మధ్య 9 వేలకు పైగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. విజయవాడ–విశాఖ మధ్య రోడ్డు ప్రమాదాలపై ప్రభుత్వం ఇటీవలే అధ్యయనం చేసింది. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు డెమో కారిడార్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
డెమో కారిడార్ ఏర్పాటుకు ప్రపంచ బ్యాంకు రుణం కోసం ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది. 2010లో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే రేణిగుంట–రాయలచెరువు మార్గాన్ని డెమో కారిడార్గా తీర్చిదిద్దేందుకు ప్రపంచ బ్యాంకు సాయమందించింది. రూ.36 కోట్లతో 136 కిలోమీటర్ల మేర కారిడార్ నిర్మించారు. 2013లో ఈ రోడ్డులో 250 మంది మృత్యువాత పడితే, డెమో కారిడార్ పూర్తయ్యాక 2015 నాటికి ఈ సంఖ్య 123కి తగ్గింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని విజయవాడ–విశాఖ మధ్య కూడా డెమో కారిడార్ చేపట్టి ప్రమాదాల సంఖ్య తగ్గించాలని యోచిస్తున్నారు. రవాణా శాఖ నోడల్ ఏజెన్సీగా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు.
డెమో కారిడార్లో ఏం చేస్తారు?
డెమో కారిడార్లో ప్రమాదకరంగా ఉన్న మలుపుల్ని సరిచేయడం, బ్లాక్స్పాట్స్ను గుర్తించి మరమ్మతులు చేయడం, రోడ్లకు అదనపు వరుసలు, బీమ్లతోపాటు సైన్బోర్డులు, జీబ్రా లైన్లు, రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేస్తారు. ఈ స్ట్రెచ్లో ట్రామాకేర్ సెంటర్ల ఏర్పాటుతోపాటు ప్రమాదానికి గురైన గోల్డెన్ అవర్లోనే ఆస్పత్రికి చేర్చేలా అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తారు.
విజయవాడ–విశాఖ మధ్య డెమో కారిడార్ ప్రాజెక్టు పట్టాలెక్కేటప్పటికి కనీసం మూడు, నాలుగేళ్ల సమయం పడుతుందని అంచనా. ఈ లోగా ఎన్హెచ్–16పై ప్రమాదకర ప్రాంతాల్లో డమ్మీ ప్రమాద వాహనాలు ఉంచి, ప్రమాదం తీరు తెన్నులు తెలిసేలా డిస్ప్లే చేయాలని రవాణా శాఖ నిర్ణయించింది. డమ్మీ ప్రమాద వాహనాలు ఉంచితే జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తారని రవాణా శాఖ భావిస్తోంది.
బెజవాడ–విశాఖ మధ్య డెమో కారిడార్!
Published Tue, Oct 11 2016 7:42 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement