సాక్షి, ముంబై: ప్రభుత్వ కార్యాలయాల్లో చాలాకాలంగా ఒకే సీటుని అంటిపెట్టుకుని పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ప్రభుత్వ శాఖల్లో చాలా మంది అధికారులు తమకు అనుకూలంగా ఉండే సీట్లలో యేళ్లపాటు పాతుకుపోయేందుకు యత్నిస్తారు. వారిని ఎవరైనా కదిలించాలని చూస్తే రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని మళ్లీ అదే సీటులోకి వచ్చేస్తారు. కాగా, ఇటువంటి అధికారులు అన్ని శాఖల్లోనూ పేరుకుపోతుండటంతో పలువురు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అలాగే మహానగరాల్లో పనిచేయడానికి ఇష్టపడే అధికారులు, వెనుకబడిన ప్రాంతాలైన విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాలకు బదిలీ చేస్తే ససేమిరా అంటారు.
తమకున్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని వాటిని నిలుపుదల చేయించుకుంటారు. కాగా, నాగపూర్లో జరుగుతున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయం చర్చకు వచ్చింది. ఇటువంటి అధికారుల విషయంలో గత ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరించిందని, దాంతో కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పనులు కుంటుపడిపోయాయని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వ శాఖల్లో ఉన్న పనిదొంగలపై, యేళ్లపాటు ఒకేచోట అతుక్కుపోయిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ నిర్ణయించారు. మొదటి విడత వేటు రెవెన్యూ శాఖపై వేయాలని ఆయన ఆదేశించారు. ఈ మేరకు ఆ శాఖలో పనిచేస్తున్న 16 మంది అధికారులను విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాలకు బదిలీ చేశారు. వీరందరూ కొన్నేళ్లుగా ముంబై, పుణే లాంటి నగరాల్లో బదిలీ కాకుండా నెట్టుకొస్తున్నవారే.
కాగా, రెవెన్యూ శాఖకు సంబంధించి ముంబై, పుణే వంటి నగరాలను విడిచి బయట ప్రాంతాలకు వెళ్లాలంటే అధికారులు అంతగా ఒప్పుకోరు. ఒకవేళ బదిలీ అయితే వెంటనే స్థానిక మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే వంటి వారితో ఒత్తిడి తెచ్చి రద్దు చేయించుకుంటారు. నగరాల్లో ఖాళీ లేకుండా పై ఆదాయమున్న ఇతర శాఖల్లోకి లేదా కార్పొరేషన్లకు పరస్పర బదిలీపై వెళ్లి అక్కడే స్థిరపడిపోతుంటారు. అయితే, ఇదే సమయంలో మరాఠ్వాడ, విదర్భ రీజియన్లలో అధికారుల కొరత కారణంగా ప్రజా పనులు సకాలంలో జరగడం లేదు.
ఈ విషయాన్ని నాగపూర్లో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కొందరు నాయకులు ఫడ్నవిస్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ముంబై, పుణేలో చిరకాలంగా తిష్టవేసిన అధికారుల జాబితా రూపొందించాలని సీఎం సూచిం చారు. ఇలాంటి అధికారులను గ్రామీణ ప్రాంతాలకు బదిలీ చేయాలని ఆదేశించారు. బదిలీ అయిన చోటికి వెంటనే వెళ్లని పక్షంలో లేదా రాజకీయ నాయకుల ఒత్తిడి తీసుకొచ్చే అధికారులపై క్రమశిక్షణా రాహిత్య చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
‘జలగ’లపై సర్కారు కన్నెర్ర!
Published Sun, Dec 21 2014 10:03 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement