కోర్టుకు డీఎండీకే ఎమ్మెల్యేలు | Sakshi
Sakshi News home page

కోర్టుకు డీఎండీకే ఎమ్మెల్యేలు

Published Fri, Apr 24 2015 1:54 AM

DMdK MLAs in court

 టీనగర్: శాసనసభ భద్రతాధికారిపై దాడి కేసులో డీఎండీకే ఎమ్మెల్యేలు ఇరువురు జార్జిటౌన్ కోర్టులో హాజరయ్యారు. అసెంబ్లీలో ఫిబ్రవరి 19వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలు జరిగాయి. ఆ సమయంలో డీఎండీకే ఎమ్మెల్యే మోహనరాజు, మాజీ ఎమ్మెల్యే గురించి చేసిన వ్యాఖ్యలకు అన్నాడీఎంకే సభ్యులు వ్యతిరేకత తెలపడంతో సభలో గందరగోళం చెలరేగింది. ఆ సమయంలో డీఎండీకే ఎమ్మెల్యేలను బయటికి గెంటివేస్తుండగా అసెంబ్లీలో భద్రతాధికారిగా వున్న స్పెషల్ ఏఎస్‌ఐ విజయన్‌పై దాడి చేశారు. దీనికి సంబంధించి డీఎండీకే ఎమ్మెల్యేలు దినకరన్, శేఖర్‌పై ఫోర్ట్ పోలీసు స్టేషన్‌లో కేసు దాఖలయింది. వీరిపై మూడు సెక్షన్లలో కేసు నమోదు చేశారు. వీరిపై కేసు విచారణ జార్జిటౌన్ కోర్టులో జరుగుతోంది. ఈ కేసులో విచారణకు ఎమ్మెల్యేలు దినకరన్, శేఖర్ ఇరువురూ గురువారం హాజరయ్యారు.
 

Advertisement
Advertisement