కేంద్రం నిర్ణయం కోసం వేచి చూడడం కన్నా, తమరు జోక్యం చేసుకోరూ అంటూ ఎన్ఎల్సీ వ్యవహారంలో సీఎం జయలలితకు డీఎంకే అధినేత ఎం కరుణానిధి హితవు పలికారు. ఎన్ఎల్సీలో నిరసనలు మిన్నంటాయి. అక్కడ
ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కార్మిక సంఘాలు రిలే దీక్షల బాట పట్టారు.
సాక్షి, చెన్నై :వేతన పెంపు, కాంట్రాక్టు కార్మికుల పర్మినెంట్, విధుల్లో మరణించే ఉద్యోగుల వారసులకు ఉద్యోగాలు తదితర డిమాండ్ల సాధనే లక్ష్యంగా నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ కార్మిక లోకం సమ్మె సైరన్ మోగించిన విషయం తెలిసిందే. ఈ సమ్మె చేపట్టి ఐదు రోజులు అవుతోంది. యాజమాన్యం బుజ్జగింపు ప్రయత్నాలు బెడిసి కొట్టడం, చర్చలు విఫలం కావడం వెరసి కార్మికులు తమ నిరసనలు ఉధృతం చేసి ఉన్నారు. ఇప్పటికే ఎన్ఎల్సీలో కొంత మేరకు విద్యుత్ ఉత్పత్తి తగ్గుముఖం పట్టి ఉండటంతో ఈ ప్రభావం రాష్ట్రం మీద పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీంతో ఎక్కడ అనధికారి కోతలు అమల్లోకి వస్తాయోనన్న ఉత్కంఠ నెలకొని ఉన్నది. ఈ పరిస్థితుల్లో తమ యాజమాన్యం నడ్డి విరిచే విధంగా కార్మిక సంఘాలు నిరసనల్ని ఉధృతం చేశారు.
అధికారిక తోముసా, అన్నా కార్మిక సంఘాలు ఓ వైపు పోరాటాన్ని సాగిస్తుంటే, మరో వైపు గుర్తింపు లేని సీఐటీయూ, పీఎంకే, ఐసీయూ, బీఎంఎస్ తదితర పది కార్మిక సంఘాలు వారికి మద్దతుగా నిరసలకు దిగారు. శుక్రవారం నుంచి క్యూ వంతెన వద్ద రిలే దీక్షలు చేపట్టారు. ఈ మార్గం గుండానే ఎన్ఎల్సీలోకి పర్మినెంట్ ఉద్యోగులు, అధికారులు సైతం వెళ్లాల్సి ఉంది. దీంతో ఆ మార్గంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. నిరసల్ని ఉధృతం చేసిన కార్మిక సంఘాలు, తమకు మద్దతుగా సమ్మెలోకి రావాలని పర్మినెంట్ ఉద్యోగులు, ఇంజనీర్ల సంఘానికి పిలుపు నిచ్చే పనిలో పడ్డారు. నిరసనలో భాగంగా ఎ క్కడ ఇంజనీర్లు, ఉద్యోగుల్ని కార్మికులు అడ్డుకుంటారోనన్న ఉత్కంఠ బయలు దేరడంతో ఎన్ఎల్సీ పరిసరాల్లో భద్రతా ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.
జోక్యం చేసుకోరూ : కార్మికులు నిరసనల్ని ఉధృతం చేసి ఉండటంతో విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం ఎదురయ్యే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. దీంతో వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం జయలలిత లేఖాస్త్రం సంధించారు. అయితే, కేంద్రం నిర్ణయం కోసం వేచి చూడటాన్ని మానుకుని, సొంత నిర్ణయం తీసుకోవాలంటూ సీఎం జయలలితకు డిఎంకే అధినేత ఎం కరుణానిధి సూచించారు. కార్మికులు సమ్మెను ఉధృతం చేసిన సమయంలో కేంద్రం నిర్ణయం కోసం ఎదురు చూడటం మంచి పద్ధతి కాదన్నారు. కేవలం లేఖాస్త్రం సంధించి , సమస్యను పక్కన పడేయడం కన్నా, స్వతహాగా స్పందించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. గతంలో ఇదే విధంగా ఎన్ఎల్సీలో సమస్య బయలు దేరినప్పుడు , తాను సీఎంగా తక్షణం స్పందించినట్టు గుర్తు చేశారు. యాజమాన్యం, కార్మిక సంఘాల్ని, కేంద్ర హోం శాఖ అధికారుల్ని పిలిపించి తన సమక్షంలో చర్చలు జరిపి సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించడం జరిగిందన్నారు. అయితే, ఆ విధంగా స్పందించడం మానుకుని, ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలంటూ లేఖాస్త్రం సంధించడం విడ్డూరంగా ఉందని వ్యంగ్యాస్త్రం సంధించారు. ఇకనైనా తమరు జోక్యం చేసుకోరూ... గతంలో తాను తీసుకున్నట్టుగానే నిర్ణయం తీసుకుని, సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించాలని సూచించారు.
జోక్యం చేసుకోండి
Published Sat, Jul 25 2015 2:32 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యదు! గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
తప్పక చదవండి
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement