సాక్షి, ముంబై: మలబార్ హిల్లో ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ హోమీ బాబా నివాసం ‘మెహెరాంగీర్’ బంగ్లాను వేలంలో విక్రయించకుండా న్యూక్లియర్ కమిషన్ ఉద్యోగులు ముందుకు వచ్చారు. ఈ బంగ్లా విక్రయాన్ని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా ఉన్న సుమారు లక్షా మంది సిబ్బంది తమ రెండు రోజుల వేతనాన్ని విరాళంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. మెహెరాంగీర్ బంగ్లాను న్యూక్లియర్ డిపార్ట్మెంట్ ఆధీనంలోకి తీసుకుని, దాని నిర్వహణ బాధ్యతలు చూసుకోవాలని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటాతో న్యూక్లియర్ కమిషన్ సిబ్బంది సంప్రదింపులు జరిపారు.
కాగా, ఈ బంగ్లా మొత్తం 1,593 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ప్రతీ చదరపు మీటరు స్థలం సుమారు రూ.1.50 లక్షల ధర పలకనుంది. ఈ ప్రకారం మొత్తం బంగ్లా రూ.270 కోట్లకు నేషనల్ సెంటర్ ఫర్ ది పర్ఫామింగ్ ఆర్ట్స్ (ఎన్సీపీఏ) విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో ప్రముఖ శాస్త్రవేత్తలో ఒకరైన డాక్టర్ హోమీ బాబా 1966లో చనిపోయారు. అనంతరం హోమీ బాబా సోదరుడు, ఎన్సీపీఏ సంస్థాపకుడు, టాటా గ్రూపు మాజీ అధికారి జమ్షెడ్ బాబా ఆధీనంలోకి ఆ బంగ్లా అధికారాలు వచ్చాయి. 2007లో జమ్షెడ్ బాబా కూడా చనిపోవడంతో ఆ బంగ్లా పూర్తి అధికారాలు ఎన్సీపీఏ చేతుల్లోకి వచ్చాయి.
ఇప్పుడు ఆ బంగ్లాను ఎన్సీపీఏ విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ నోటీసు కూడా ఇటీవలే జారిచేసింది. ప్రస్తుతం మార్కెట్ ధరను బట్టి ప్రతీ చదరపు మీటరుకు రూ.1.45 లక్షల చొప్పున అమ్ముతామని ప్రకటన ఇచ్చింది. అయితే పోటీదారుల వల్ల దీని ధర ఏకంగా రూ.270 కోట్లకు చేరుకునే అవకాశాలున్నాయి. అయితే దీన్ని విక్రయించకుండా అడ్డుకోవాలని నూక్లియర్ కమిషన్ సిబ్బంది శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అందుకు అవసరమైన డబ్బును ఎన్సీపీఏకు చెల్లించి, ఆ బంగ్లాను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
హోమీబాబా బంగ్లా అమ్మొద్దు
Published Wed, Apr 9 2014 10:35 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement