న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాలు నడిపే మహిళలు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా రవాణా విభాగం నిబంధనల్లో మార్పులు చేసుకునేందుకు రవాణా విభాగానికి ఈసీ అనుమతించడాన్ని అతివలు స్వాగతిస్తున్నారు. దీనివల్ల తమ భద్రతకు భరోసా ఉంటుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘హెల్మెట్ల వల్ల భద్రత ఉంటుంది. భద్రత విషయం వచ్చేసరికి లింగ విభేదం ఉండకుండా చూడాలి. కారు డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ ధరించడం కూడా ముఖ్యమేన’ని తన సోదరుడితో కలిసి తరచూ బైక్పై వెళ్లే కళాశాల విద్యార్థి అరునిత తివారీ మంగళవారం మీడియాకు తెలిపారు. మగవారు మాత్రమే సీట్బెల్ట్లు ధరించాలని ఎందుకు వాదించరని, అలాంటప్పుడు హెల్మెట్ల విషయంలో రాద్ధాంతం ఎందుకని ప్రశ్నించారు.
కాగా, మహిళలకు హెల్మెట్లు ధరించడం తప్పనిసరి చేసుకునేందుకు నిబంధనాల్లో మార్పులు చేసుకునేందుకు రవాణా విభాగానికి ఈసీ నుంచి అనుమతి వచ్చిందని ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి విజయ్ దేవ్ తెలిపారు. తమ అధికార పరిధిలో ఇలాంటి నోటీసులను పూర్తిగా తనిఖీ చేశాకే ఆమోదిస్తామని తెలిపారు. అయితే ఈ నిబంధన అమలు చేస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి రాదని వివరణ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ జరిగే మే 16 వరకు సాధారణ పరిపాలన విభాగ నిర్ణయాలు తీసుకోవచ్చన్నారు. ‘ఈ ప్రక్రియకు సమయం తీసుకుంటుంది. మహిళల నుంచి సలహాలు తీసుకోవాలి. ఆ తర్వాత రవాణా విభాగం ఇచ్చే ప్రతిపాదనలు, సూచనల ఆధారంగా లెఫ్ట్నెంట్ గవర్నర్ నజీమ్ జంగ్ తుది నిర్ణయం తీసుకుంటార’ని దేవ్ వివరించారు. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం... భారత్లోనే అత్యధికంగా 1,05,725 మరణాలు చోటుచేసుకున్నాయన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
బైక్లు నడిపే మహిళలకు హెల్మెట్ ధరించడాన్ని తప్పనిసరిచేసేలా రవాణా విభాగానికి ఆదేశాలు ఇవ్వాలని 2011లో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సామాజిక కార్యకర్త ఉల్హాస్ ఈసీ తాజా నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘ఈ విషయంలో ఈసీ ఎలాంటి ఆలస్యం చేయవద్దు. వెంటనే అనుమతి ఇచ్చేయాలి. గతంలో ఉన్న ప్రభుత్వం దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింద’ని తెలిపారు. ప్రస్తుతమున్న మోటార్ వెహికల్ చట్టం, నిబంధల ప్రకారం... ద్విచక్రవాహనాలు నడిపే మహిళలకు హెల్మెట్ ధరించడం తప్పనిసరి కాదని, సిక్కులు తలపాగా ధరించొచ్చన్న నిర్ణయంపై ఆమె మండిపడ్డారు. ‘ప్రమాదాలు మతప్రాతిపదికన జరగవు. ఎవరైనా ఎక్కడైనా ప్రమాదానికి గురికావచ్చు.
హెల్మెట్ నిబంధనను సిక్కులకు కూడా వర్తింపచేయాల’ని ఉల్హాస్ డిమాండ్ చేశారు. ‘ఈసీ తీసుకున్న తాజా నిర్ణయాన్ని మహిళా సమాజమంతా గౌరవిస్తుంది. దీన్ని రాజకీయం చేయవద్దు. వెంటనే ఈ నిర్ణయాన్ని అమలు జరిగేలా చూడాల’ని డ్రంకెన్ డ్రైవింగ్కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్న ఎన్జీవో వ్యవస్థాపక అధ్యక్షురాలు ప్రిన్స్ సింగాల్ అన్నారు. దీన్ని కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితం చేయకుండా దేశమంతటా వర్తింపచేయాలని సూచించారు. హెల్మెట్లు ధరించడం అవసరం, దాని గురించి మరో ఆలోచన చేయకూడదని జర్నలిజం విద్యార్థిని కనికా వాలియా అన్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ నిబంధనను అమలు చేయాలన్నారు. కాగా, మహిళలు హెల్మెట్లు ధరించాలన్న నిబంధనపై ఇంకా నోటిఫికేషన్ వెలువడలేదని ప్రత్యేక భద్రత పోలీసు కమిషనర్ తాజ్ హస్సన్ అన్నారు. రవాణా విభాగం నుంచి నోటిఫికేషన్ రాగానే హెల్మెట్లు ధరించని మహిళలకు చలాన్లు జారీ చేస్తామని తెలిపారు.
హెల్మెట్ ధారణ ఎంతో భద్రం
Published Tue, Apr 29 2014 11:02 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
ఆటా కన్వెన్షన్ 2024: ఆకాశమే హద్దుగా సాగుతున్న నృత్య పోటీలు!
చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
పేదల పథకాలపై కూటమి కుట్ర..!
బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత
తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా
Summer 2024 : కీరదోసను తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?
చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ
జగన్ రాకతో జనసంద్రమైన రాజానగరం
చంద్రబాబు కోసం మాజీ ఐఏఎస్ డ్రామా.. అడ్డంగా దొరికిపోయాడు
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement