చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసే పథకాలపై ముద్రించిన ముఖ్యమంత్రి జయలలిత ఫొటోలు, అన్నాడీఎంకే చిహ్నమైన రెండాకులు పోలిన బొమ్మలను తొలగించడమో లేక కప్పి ఉంచడమో చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అన్నాడీఎంకే మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మినీ బస్సులపై ఉన్న బొమ్మలపై ‘రెండాకులు’ మూయాల్సిందే తమ వివరణను కోరకుండా ఎన్నికల కమిషన్ తొందరపాటు నిర్ణయాన్ని తీసుకుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో జయలలిత పేర్కొన్నారు.
కోర్టులో వాదోపవాదాలు సాగుతుండడంతో మినీ బస్సులపై ముద్రించిన రెండాకుల చిహ్నాన్ని పోలిన నాలుగు ఆకుల బొమ్మలు అలాగే ఉన్నారుు. దీనిపై డీఎంకే కోశాధికారి స్టాలిన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పర్యావరణ పరిరక్షణకు గుర్తుగా ఆకుల బొమ్మలు ఉన్నాయంటూ అన్నాడీఎంకే తరపున సీనియర్ న్యాయవాది రాజేంద్రన్ తన వాదనను వినిపించారు. ఈ క్రమంలో మంగళవారం మళ్లీ విచారణ జరిగింది.
మినీ బస్సులపై ముద్రించిన రెండాకులు అన్నాడీఎంకే పార్టీ చిహ్నం కాకున్నా ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న ఈసీ నిర్ణయాన్ని తాము సమర్థిస్తున్నట్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అగ్నిహోత్రి, న్యాయమూర్తి ఎంఎం సుందరేష్ ప్రకటించారు. రాష్ట్ర రవాణా శాఖ వెంటనే బస్సులపై ఉన్న ఆకుల బొమ్మలను కప్పి ఉంచాలని ఆదేశించారు. అన్నాడీఎంకే, డీఎంకే మధ్య సాగిన పిటిషన్ల పోరులో డీఎంకే కోశాధికారి స్టాలిన్దే పైచేయిగా నిలవడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.
చైతన్య ప్రచారాలు
ఇదిలా ఉండగా ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని కోరుతూ ఎన్నికల కమిషన్ మంగళవారం నుంచి చైతన్య ప్రచారాలు చేపట్టింది. ఆటోల ద్వారా కరపత్రాలను, సీడీలను పంచుతూ ఓటర్లను చైతన్య పరుస్తోంది. ఁఓటు మీ జన్మహక్కు, బాధ్యత, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి, దేశాన్ని రక్షించుకోవాలి, దేశం బలహీనం కాకుండా కాపాడుకోవాలిరూ అంటూ కరపత్రాల్లో సూచించారు. ఁఈ దేశాన్ని ఎవరు పరిపాలించాలో మీ ఓటు నిర్ణయిస్తుందిరూ అంటూ వివరించారు.
‘రెండాకులు’ మూయాల్సిందే
Published Wed, Mar 26 2014 2:45 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement