సాక్షి, ముంబై: ఎప్పుడెప్పుడా అని అన్ని రాజకీయ పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న లోక్సభ ఎన్నికల షెడ్యూల్ బుధవారం విడుదలైంది. రాష్ట్రంలోని 48 లోక్సభ నియోజకవర్గాలకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. వాషీం జిల్లాలో రిసోడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహిస్తామని స్పష్టం చేసింది. వారం రోజుల వ్యవధితో వరుసగా మూడు గురువారాలు ఈ ఎన్నికలు జరుపుతామని వెల్లడించింది. మొదటి దశలో ఏప్రిల్ 10వ తేదీన పది స్థానాలకు, రెండో దశలో ఏప్రిల్ 17వ తేదీన 19 నియోజకవర్గాలకు, మూడో దశలో ఏప్రిల్ 24వ తేదీన 19 స్థానాలకు ఎన్నికలు ఉంటాయని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల నియమావళి బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది.
మొదటి దశలో...
మొదటి దశలో విదర్భలోని 10 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో బుల్డానా, అకోలా, అమరావతి, వర్ధా, రాంటేక్, నాగపూర్, భండారా-గోండియా, గడ్చిరోలి-చిమూర్, చంద్రాపూర్, యావత్మాల్-వాషీం స్థానాలున్నాయి.
రెండో దశలో...
ఏప్రిల్ 17వ తేదీన జరగనున్న రెండో దశ ఎన్నికల్లో మరాఠ్వాడాతోపాటు పశ్చిమ, ఉత్తర మహారాష్ట్రలకు చెందిన 19 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. వీటిలో హింగోలి, నాందేడ్, పర్భణీ, మావల్, పుణే, బారామతి, శిరూర్, అహ్మద్నగర్, షిర్డీ, బీడ్, ఉస్మానాబాద్, లాతూర్, షోలాపూర్, మాఢా, సాంగ్లీ, సాతారా, రత్నగిరి-సింధుదుర్గా, కొల్హాపూర్, హాతకణంగలే ఉన్నాయి.
మూడో దశలో...
ఏప్రిల్ 24వ తేదీన జరగనున్న మూడో దశ ఎన్నికల్లో ముంబైతోపాటు ఠాణే జిల్లాలున్నాయి. మరాఠ్వాడా, ఉత్తర మహారాష్ట్ర, కొంకణ్ ప్రాంతాల్లోనూ ఎన్నికలు జరగనున్నాయి. చివరి దశలో మొత్తం 19 లోక్సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటిలో దక్షిణ ముంబై, దక్షిణ మధ్య ముంబై, ఉత్తర మధ్య ముంబై, ఉత్తర ముంబై, వాయవ్య ముంబై, ఈశాన్య ముంబై, ఠాణే, భివండీ, కల్యాణ్, పాల్ఘర్, రాయ్గఢ్, నాసిక్, దిండోరి, ఔరంగాబాద్, జాల్నా, రావేర్, జల్గావ్, ధులే, నందుర్బార్ ఉన్నాయి.
ఏప్రిల్ 10న అసెంబ్లీ ఉప ఎన్నిక...
వాషీం జిల్లాలోని రిసోడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరగనుంది. ఏప్రిల్ 10వ తేదీన ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సుభాష్ జనక్ గత ఏడాది అక్టోబర్ 28వ తేదీన మరణించారు. అప్పటినుంచి ఈ నియోజకవర్గంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించలేదు. అయితే లోక్సభ ఎన్నికలతోపాటు ఈ నియోజకవర్గంలో ఉపఎన్నిక ఉంటుందని ఈసీ ప్రకటించింది.
ఇవీ ప్రధాన పార్టీలు
కాంగ్రెస్-ఎన్సీపీ (ప్రజాసామ్యకూటమి), శివసేన-బీజేపీ-ఆర్పీఐ-స్వాభిమాన్ పార్టీ (మహాకూటమి), రాజ్ఠాక్రే సారథ్యంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ, ఎస్పీ, పీఐపీ తదితర పార్టీలు లోక్సభ ఎన్నికల్లో తలపడుతున్నాయి. తమ తమ భవితవ్యాన్ని తేల్చుకో నున్నాయి.
‘సోషల్ మీడియా ఖర్చును కచ్చితంగా చూపించాల్సిందే’
లోక్సభ ఎన్నికల్లో ప్రచారం కోసం అభ్యర్థులు ఉపయోగించే సోషల్ మీడియాను కూడా పర్యవేక్షిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈవో నితిన్ గాద్రే తెలిపారు. దీనికి సంబంధించిన ఖర్చు వివరాలను అభ్యర్థులు తప్పనిసరిగా ఈసీకి సమర్పించాల్సి ఉంటుందని ఆయన బుధవారం మీడియాకు తెలిపారు. ఇప్పటివరకు రాష్ర్టంలో 7.89 కోట్ల మంది ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారని వివరించారు. ఈ నెల తొమ్మిది వరకు ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఇందుకోసం రాష్ట్రంలో 450 నమోదు కేంద్రాలు పనిచేస్తాయని తెలిపారు. రాష్ట్రంలో ఆరు వేల సమస్యాత్మక, 650 అతి సమస్యాత్మక ప్రాంతాలున్నాయన్నారు. ఇటువంటి ప్రాంతాల్లో ఎటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా చూడాల్సి ఉందన్నారు.
తీన్బార్
Published Wed, Mar 5 2014 10:25 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement