కరీంనగర్‌లో 'డబుల్‌' ఇళ్ల శంకుస్థాపన | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌లో 'డబుల్‌' ఇళ్ల శంకుస్థాపన

Published Thu, Mar 30 2017 11:37 AM

Etela Rajender Lays Foundation Stone For Double Bed Room Scheme

కరీంనగర్ : కరీంనగర్‌ నియోజకవర్గ పరిధిలోని పద్మానగర్‌లో మంత్రి ఈటెల రాజేందర్‌ గురువారం డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొదటి విడతలో 1400 ఇండ్ల నిర్మాణం చేపడుతున్నామని, మరో 1000 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను నిర్మిస్తామని తెలిపారు. అర్హులైన వారికే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించి ఇస్తామని, రాజీవ్‌ గృహకల్పలో ఆగిపోయిన ఇండ్లను కూడా పూర్తిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన పలువురు నేతలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Advertisement
Advertisement