తెలుగుగంగ నీటి కోసం రైతుల ఆందోళన | Sakshi
Sakshi News home page

తెలుగుగంగ నీటి కోసం రైతుల ఆందోళన

Published Thu, Dec 29 2016 11:46 AM

farmers protest for telugu ganga water

వెంకటగిరి : నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం అమ్మపాలెం వద్ద వెంకటగిరి - గూడూరు ప్రధాన రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు. వరి పంటకు తెలుగు గంగ నీటిని విడుదల చేయాలని కోరుతూ అమ్మపాలెం, కందనాలాపాడు, పాతమాందాపురం గ్రామాలకు చెందిన సుమారు 150 మంది రైతులు రాస్తారోకోకు దిగారు. దీంతో ఆ మార్గంలో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఈ విషయం తెలిసిన పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని రైతులను సముదాయిస్తున్నారు.
 

Advertisement
Advertisement