అప్పులు తీర్చే మార్గం కానరాక
ఆత్మహత్య చేసుకున్న రైతులు
బెంగళూరు(బనశంకరి) : రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం మరో నలుగురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మైసూరు జిల్లా హెగ్గెడే దేవనకోటేలోని మాదాపుర గ్రామానికి చెందిన రైతు నటేశ్మూర్తి(30) తనకున్న మూడెకరాల పొలంలో పత్తి, మొక్కజొన్న పంట సాగు కోసం రూ.4 లక్షల మేర బ్యాంకుల నుంచి అప్పులు చేశాడు. అప్పు చెల్లించాలంటూ బ్యాంకు నుంచి నోటీసులు రావడంతో, పంట నష్టంతో అప్పులు తీర్చే దారిలేక నటేశ్మూర్తి తన పొలంలో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై హెచ్డీ కోటే పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఇప్పటి వరకు మైసూరు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్య ఆరుకు చేరుకుంది.
తుమకూరు జిల్లాలో...
తుమకూరు జిల్లా గుబ్బి తాలూకా నిట్టూరు హొబళి అమరాపురకు చెందిన రైతు యోగానందమూర్తి(34) తనకున్నఐదు ఎకరాల పొలంలో పంట పెట్టుబడుల కోసం వివిధ బ్యాంకులు, ప్రైవేటు వ్యక్తుల నుంచి రూ.7 లక్షల మేర అప్పులు చేశాడు. ఇటీవల రోజుల్లో అప్పులు వారి వేధింపులు అధికం కావడంతో ఇతను సంబంధీకులను డబ్బు అడిగాడు. అక్కడ అతని ప్రయత్నాలు ఫలించకపోవడంతో పరువు పోతుందని మదన పడుతూ మంగళవారం రాత్రి భోజనం ముగించి నిద్రపోయాడు. గురువారం ఉదయం అనుమానాస్పదంగా అతను మరణించి కనిపించాడు. కుటుంబసభ్యుల నుంచి సమాచారం అందుకున్న గుబ్బి పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు.
హుబ్లీ జిల్లాలో..
హుబ్లీ జిల్లా కుందగోళ తాలూకా బెట్టదూరు గ్రామానికి చెందిన రైతు రామప్పకడపట్టి(66), తనకున్న నాలుగు ఎకరాల పొలంలో సోయాబీన్స్, సెనగ పంట వేశాడు. వ్యవసాయ పెట్టుబడులకోసం బ్యాంకు నుంచి రూ.2 లక్షల మేర అప్పు చేశాడు. పంట దిగుబడికి వచ్చే సమయంలో అకాల వర్షంతో పూర్తిగా నష్టపోయాడు. ఈ నేపథ్యంలోనే అప్పులు తీర్చాలంటూ ఒత్తిళ్లు మొదలయ్యాయి. వాటిని తీర్చే మార్గం కానరాక మంగళవారం రాత్రి ఇంటి వద్దనే అతను విషం తాగాడు. విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే అతన్ని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడ అతను మరణించాడు. ఘటనపై కుందగోళ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మండ్య జిల్లాలో...
మండ్య జిల్లా శ్రీరంగ పట్టణానికి చెందిన రైతు కుమార్(45) తనకున్న అర ఎకరా పొలంతో పాటు మరో ఎకరా పొలాన్ని కౌలుకు తీసుకుని చెరుకు, అరటి పంట వేశాడు. పంట పెట్టుబడులు, తన కుమారుడి వైద్యం కోసం సుమారు రూ.4 లక్షల మేరకు బ్యాంకులు, ప్రైవేటు వ్యక్తుల నుంచి అప్పులు చేశాడు. ్రృకతి వైపరీత్యాలతో పంట పూర్తిగా నష్టపోయాడు. ఈ నేపథ్యంలోనే అప్పుల వారి నుంచి ఒత్తిళ్లు మొదలయ్యాయి. వేధింపులు తాళలేక బుధవారం మధ్యాహ్నం కుమార్ విషం తాగాడు. విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే అతన్ని మైసూరులోని కిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. ఘటనపై శ్రీరంగపట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు మండ్య జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల సంఖ్య 22కు చేరుకుంది.
మరో నలుగురు...
Published Thu, Jul 23 2015 1:56 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
Advertisement