తాళి బొట్టు తెంచి దగ్ధం చేశాడు | Sakshi
Sakshi News home page

తాళి బొట్టు తెంచి దగ్ధం చేశాడు

Published Thu, Mar 5 2015 4:14 PM

తాళి బొట్టు తెంచి దగ్ధం చేశాడు - Sakshi

తిరువొత్తియూరు: ప్రేమించి వివాహం చేసుకుందని ఆగ్రహంతో ప్రియుడు తండ్రి వధువు తాళి బొట్టును తెంచి దగ్ధం చేశాడు. అయితే వెంటనే ప్రేమికుడు, తన ప్రియురాలి మెడలో తాళిబొట్టు కట్టాడు. సేలం జిల్లా ఓమలూరు సమీపం, పన్నపట్టికి చెందిన వ్యక్తి పళణిస్వామి కుమారుడు గోవింద (22) సేలంలో వున్న ఒక జౌళి దుకాణంలో పని చేస్తున్నాడు. అదే దుకాణంలో పని చేస్తున్న దివ్య (19), గోవింద రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. గత నెల 23వ తేదీ సేలం ఊత్తుమలై మురుగన్ ఆలయంలో గోవింద, దివ్య వివాహం చేసుకున్నారు.
 
 తరువాత ప్రేమికులు ఇద్దరూ తమ తమ ఇళ్లకు వెళ్లారు. ఈ సంగతి తెలుసుకున్న గోవింద తండ్రి పళణిస్వామి తన కుమారుడిని ఇంటిలోనే బంధించి పనికి మాన్పించాడు. దీంతో స్నేహితుల సహాయంతో బయటపడిన గోవింద వివాహం చట్టబద్ధం కావడానికి ఓమలూరులో రిజిష్టర్ వివాహం చేసుకోవడానికి దివ్యను తీసుకుని రిజిష్టర్ కార్యాలయానికి వెళ్లారు. ఈ సంగతి తెలుసుకున్న పళణిస్వామి ప్రేమికులను వెంటాడి వారిపై దాడి చేసి దివ్య మెడలో వున్న తాళి బొట్టు తెంచి దగ్ధం చేశాడు.
 
 తరువాత పళణిస్వామి నుంచి తప్పించుకున్న ప్రేమ జంట ఓ దుకాణంలో పసుపుతాడును తీసుకుని పసుపుకొమ్ము ఉన్న తాళి బొట్టును గోవింద దివ్య మెడలో కట్టాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ప్రేమజంటకు ఆశ్రయమిచ్చి రిజిష్టర్ వివాహం చేయించారు.

Advertisement
Advertisement