మండుతున్న ఉద్యాననగరి
35.5 డిగ్రీల సెల్సియస్ నమోదు
కలబుర్గిలో 40డిగ్రీలు
బెంగళూరు: సూర్యతాపం రాష్ట్రాన్ని వేడెక్కిస్తోంది. మార్చి రాకనే ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా ఉద్యాననగరిగా పేరుగాంచిన బెంగళూరుతో సహా పలు పట్టణాల్లో గత పదేళ్లలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతల్లో కూడా స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. బెంగళూరులో సాధారణ ఉష్ణోగ్రత 31.5 డిగ్రీల సెల్సియస్ కాగా, గత సోమవారం ఉష్ణోగ్రతలో నాలుగుడిగ్రీల పెరుగుదల నమోదు చేసుకుని 35.5 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఫిబ్రవరి నెలకు సంబంధించి గత పదేళ్లలో ఇదే అతి ఎక్కువ పగటి ఉష్ణోగ్రత. అంతకు ముందు 2005లో ఫిబ్రవరి నెలలో 35.9 డిగ్రీల సెన్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావడమే ఇప్పటి వరకూ ఉన్న రికార్డు. ఒక్క బెంగళూరే కాక రాష్ట్రంలోని పలు చోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్-కర్ణాటక ప్రాంతాల్లోని జిల్లాల్లో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
బిసిలునాడు (వేసవి ప్రాంతం)గా పేరుగాంచిన కలబుర్గీలోలో సాధారణ ఉష్ణోగ్రత 35 డిగ్రీలు కాగా ప్రస్తుతం నలభై డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యింది. ఇప్పటి వరకూ ఇదే అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రత. అంతకు ముందు అత్యధికంగా 39.4 డిగ్రీల ఉష్ణోగ్రత రెండేళ్లక్రితం నమోదైంది. మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఈ విషయమై భారత వాతావరణ శాఖ బెంగళూరు విభాగం అధిపతి గీతా అగ్నిహోత్రి మాట్లాడుతూ.... ‘ఖరీఫ్, రబీల్లో సరైన వర్షాలు కురవక పోవడంతో వాతావరణంలో తేమశాతం దారుణంగా పడిపోయింది. దీంతో వేసవి ప్రారంభంలోనే ఇటువంటి ఎండలను చవిచూడాల్సి వస్తోంది. రానున్న కాలంలో ఎండలు మరింత మండిపోయే అవకాశం ఉంది. మా అంచనా ప్రకారం 2000 ఏడాదికి ముందు ఉన్న ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చు.’ అని అభిప్రాయపడ్డారు.
ప్రతాపం
Published Thu, Feb 25 2016 1:54 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement