స్వర్ణ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు : బోగి దగ్ధం | Sakshi
Sakshi News home page

స్వర్ణ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు : బోగి దగ్ధం

Published Sun, May 29 2016 11:35 AM

స్వర్ణ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు : బోగి దగ్ధం - Sakshi

చెన్నై: తమిళనాడు రైల్వేస్టేషన్‌లో ఆదివారం తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జొలర్‌పెటై నుంచి బెంగళూరు బయలుదేరిన స్వర్ణ ఎక్స్‌ప్రెస్ రైలు జొలర్‌పెటై స్టేషన్‌లో ఉండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.

ఈ ప్రమాదంలో రైల్లోని ఒక బోగి పూర్తిగా కాలిబూడిదైంది. ప్రయాణికుల ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్ షార్ట్ సర్వ్కూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రమాద ఘటనపై రైల్వే అధికారులు విచారణను చేపట్టారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement