చెన్నై, సాక్షి ప్రతినిధి: నిరుద్యోగంలో తమిళనాడు దేశంలోనే ప్రథమ స్థానం దక్కించుకుంది. అభివృద్ధి, సంక్షేమ పథకాల విషయంలో ఎలా ఉన్నా నిరుద్యోగంలో మాత్రం తమిళనాడు అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. ఉపాధికల్పనా కార్యాలయ లెక్కల ప్రకారం నిరుద్యోగుల సంఖ్యలో రాష్ట్రంలో 77 లక్షల మంది ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారు. పట్టభద్రులైన యువత మంచి ఉద్యోగంలో స్థిరపడాలని కలలు కంటారు. అందులో అధికశాతం మందికి ప్రభుత్వం ఉద్యోగం ఓ లక్ష్యం. అయితే ఎంతో నైపుణ్యం కలిగిన యువతకు సైతం ప్రభుత్వ ఉద్యోగం అందని ద్రాక్షపండుగా మారిపోయింది. అయినా మొక్కవోని దీక్షతో ఉపాధికల్పనా కార్యాలయాల్లో తమ పేర్లను నమోదు చేసుకునేవారి సంఖ్య ఏమాత్రం తగ్గడంలేదు. ఉపాధి కల్పనా కార్యాలయాల్లో నమోదు చేసుకున్న నిరుద్యోగుల వివరాలను ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టగా దేశం మొత్తం మీద 4.47 కోట్ల మంది నిరుద్యోగులుగా ఉన్నట్లు తేలింది. రాష్ట్ర స్థాయి వివరాలను పరిశీలిస్తే 77 లక్షల మందితో ఇతర రాష్ట్రాల కంటే తమిళనాడు ముందుంది.
ఉపాధి కల్పనా కార్యాలయాల్లో క్యూలు: ఎప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగం రాకపోతుందా అనే ఆశతో ఎందరో నిరుద్యోగులు ఉపాధికల్పనా కార్యాలయాల వద్ద ఇంకా క్యూ కడుతూనే ఉన్నారు. అయితే నిరుద్యోగుల ఆశలపై నీళ్లుచల్లే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు నెరపాల్సిన విద్య, ప్రజా పనులు, జాతీయ రహదారులు, రవాణా, పోలీస్ తదితర శాఖల్లో సైతం ఖాళీలను భర్తీ చేయడం లేదు. ప్రజా పనుల శాఖలో 400 ఖాళీలకు గానూ 202 పోస్టులకు మాత్రమే ఇటీవల రాత పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి నియామక ఉత్తర్వులు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నట్లు అభ్యర్దులు వాపోతున్నారు. ప్రజా పనుల శాఖలో 250 అసిస్టెంట్ ఇంజనీర్ల పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.
జనాభా పెరుగుదలకు అనుగుణంగా సేవలను విస్తరిస్తూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల సంఖ్య కూడా పెంచాల్సి ఉంది. దీని వల్ల ఖాళీలు భర్తీ కావడంతోపాటూ కొత్త ఉద్యోగాలకు అవకాశం ఏర్పడుతుంది. అయితే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన సమయంలో అంటే 1947లో ఏరకమైన ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయో అవే నేటికీ కొనసాగుతున్నాయి. ఏడాదికి సగటున ఉపాధి కల్పనా కార్యాలయాల్లో 10 వ తరగతి నుంచి ప్లస్టూ వరకు పేర్లను నమోదు చేసుకునే విద్యార్థుల సంఖ్యే 5.5లక్షలుగా ఉంటోంది. వీరుగాక పట్టభద్రులు, ఉపాధ్యాయ, అధ్యాపక, పీజీ, ఇంజనీర్లు, డాక్టర్లు క లుపుకుంటే 9 లక్షల మంది వరకు ఉపాధికల్పనా కార్యాయాన్ని ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు రావన్న నిరాశతో నమోదు చేసుకోని వారి సంఖ్య భారీగానే ఉండడం గమనార్హం.
పది నెలల్లోనే పదవీ విరమణ
ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలన్న లక్ష్యం నెరవేరినా పదినెలల్లోనే పదవీ విరమణ పొందిన విచిత్ర సంఘటన జరిగింది. తేని జిల్లాకు చెందిన వేలుమణి పాలిటెక్నిక్ ఉత్తీర్ణత సాధించి, ప్రభుత్వ ఉద్యోగం కోసం మధురై జిల్లా ఉపాధికల్పనా కార్యాయంలో తన పేరును 1987లో నమోదు చేసుకున్నాడు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా తనపేరును రెన్యువల్ చేసుకుంటూనే ఉన్నాడు. ఉద్యోగార్హత వయసు మీరిపోరుున తరుణంలో నిరాశకు గురైన అతను కోర్టులో కేసు వేశాడు. వేలుమణికి అనుకూలంగా కోర్టు తీర్పు వెలువడటంతో 2012 ఏడాది మధ్యలో 58 ఏళ్ల వయసులో ఎట్టకేలకూ ప్రభుత్వ ఉద్యోగంలో చేరాడు. అయితే పదినెలల సర్వీసులోనే పదవీ విరమణ చేయకతప్పలేదు. దీంతో ఇతర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు చేకూరే ప్రయోజనాలేవీ అందలేదు. దీంతో పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగి అనే పేరు మినహా వేలుమణికి మరే సంతోషమూ మిగల్లేదు.
నిరుద్యోగంలో ఫస్ట్
Published Thu, Dec 11 2014 2:52 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement