మహిళ హత్యకేసులో నలుగురు నిందితుల అరెస్ట్‌  | Sakshi
Sakshi News home page

మహిళ హత్యకేసులో నలుగురు నిందితుల అరెస్ట్‌ 

Published Tue, Feb 27 2018 2:25 PM

Four arrested in elderly woman murder case in Odisha - Sakshi

బరంపురం : వారం రోజుల క్రితం నగర శివారు బెందాలి గ్రామం కెనాల్‌ పక్కన జరిగిన మహిళ హత్యకు సబంధించిన కేసులో నలుగురు నిందితులను  అరెస్ట్‌ చేసినట్లు ఏఎస్‌పీ సంతున్‌ కుమార్‌ దాస్‌ తెలియజేశారు. ఈ మేరకు  సోమవారం ఆయన  సదర్‌ పోలీస్‌స్టేషన్‌లో విలేకరు ల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ సదర్‌ పోలీస్‌స్టేష న్‌ పరిధిలో గల నగర శివారు బెందాలి గ్రామం దగ్గరలో  వివా హిత ప్రతిమా బెహరా హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. నాలుగేళ్ల క్రితం ప్రతిమా బెహర భర్త మృతి చెందాడు. అనంతరం అదే గ్రామానికి చెందిన సనాతన్‌ సాహుతో ప్రతిమా బెహరాకు వివాహేతర సబంధం ఉన్నట్లు చెప్పారు.

అయితే గత 19వ తేదీన ప్రతిమా బెహరా గ్రామ శివారు కెనాల్‌లో స్నానం చేసేందుకు వెళ్లగా సనాతన్‌ సాహు తన సహచరులతో ఆమెపై లైంగికదాడికి పాల్పడి అనంతరం గొంతునులిమి హ త్య చేసినట్లు చెప్పారు. ఈ హత్యకు సబంధించిన ముఖ్య నేరస్థుడు సనాతన్‌ సాహుతో పాటు మనోజ్‌ కుమార్‌ సాహు, నీలాంచల్‌ దాస్, రామదాస్‌లను అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని వెంటనే పట్టుకుంటామని ఏఎస్‌పీ సంతున్‌కుమార్‌ దాస్‌ చెప్పారు. సమావేశంలో సదర్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌డీపీఓ అశోక్‌కుమార్‌ మహంతి ఐఐసీ అధికా రి శివశంకర్‌ మహాపాత్రో పాల్గొన్నారు. 

1/1

హత్యకు గురైన మహిళ మృతదేహం (ఫైల్‌)

Advertisement
Advertisement