మృత్యు పిడుగులు | Sakshi
Sakshi News home page

మృత్యు పిడుగులు

Published Wed, May 10 2017 9:36 AM

మృత్యు  పిడుగులు

► పిడుగు పాటుతో నలుగురు మృతి
► చిత్రదుర్గం జిల్లాలో ఘోరాలు


సాక్షి, బళ్లారి :  చిత్రదుర్గం జిల్లాలో మంగళవారం వేర్వేరు చోట్ల పిడుగుపాటుకు గురై నలుగురు మరణించారు.  చిత్రదుర్గం జిల్లా హిరియూరు తాలూకా వాణివిలాస సాగర(మారికణివె) పోటు జలాల్లో ఈత కొట్టేందుకు కురుబరహళ్లి గ్రామానికి చెందిన 9 మంది వెళ్లగా పిడుగు పడటంతో లెక్చరర్‌ మాలేశ్‌ నాయక్‌(30), ఉపాధ్యాయుడు ఛాయాపతి, డ్రైవర్‌ హరీష్‌లు మృతి చెందారు. దీంతో కురుబరహళ్లి గ్రామం విషాదంలో మునిగి పోయింది. ఈ ఘటనపై హిరియూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరో ఘటనలో మొళకాల్మూరు తాలూకా బండ్రావి సమీపంలో గొర్రెలు మేపేందుకు వెళ్లిన జంబక్క(35) అనే మహిళ మంగళవారం సాయంత్రం పిడుగుపాటుకు గురై మరణించింది. ఈ ఘటనపై మొళకాల్మూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement
Advertisement