నాసిక్: చెరుకుతోటలో ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడు చిరుత దాడిలో మృతి చెందాడు. ఈ ఘటన మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని సాయ్ఖేడ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.
అటవీశాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. చెరుకుతోటలో పనికి వెళ్లిన తన తల్లిదండ్రులతో పాటు సర్థక్ సోల్సె అనే బాలుడు వెళ్లాడు. తల్లిదండ్రులు పనిలో ఉండగా.. బాలుడు చెరుకు తోటలో ఆడుకుంటూ గడుపుతున్నాడు. సాయంత్రం వేళలో అకస్మాత్తుగా వచ్చిన చిరుతపులి బాలుడిపై దాడిచేసి.. అటవీప్రాంతంలోకి లాక్కెళ్లింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టగా తీవ్రగాయాలతో బాలుడు దొరికాడు. గుంపుగా వచ్చిన జనాన్ని చూసి చిరుత పరారైంది. వెంటనే బాలుడిని చాందోరి గ్రామంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తేల్చారు. చిరుతను పట్టుకోవడానికి ఆ ప్రాంతంలో బోన్లను ఏర్పాటు చేసినట్లు డివిజన్ ఫారెస్ట్ అధికారి రామానుజన్ వెల్లడించారు.
అటవీశాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. చెరుకుతోటలో పనికి వెళ్లిన తన తల్లిదండ్రులతో పాటు సర్థక్ సోల్సె అనే బాలుడు వెళ్లాడు. తల్లిదండ్రులు పనిలో ఉండగా.. బాలుడు చెరుకు తోటలో ఆడుకుంటూ గడుపుతున్నాడు. సాయంత్రం వేళలో అకస్మాత్తుగా వచ్చిన చిరుతపులి బాలుడిపై దాడిచేసి.. అటవీప్రాంతంలోకి లాక్కెళ్లింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టగా తీవ్రగాయాలతో బాలుడు దొరికాడు. గుంపుగా వచ్చిన జనాన్ని చూసి చిరుత పరారైంది. వెంటనే బాలుడిని చాందోరి గ్రామంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తేల్చారు. చిరుతను పట్టుకోవడానికి ఆ ప్రాంతంలో బోన్లను ఏర్పాటు చేసినట్లు డివిజన్ ఫారెస్ట్ అధికారి రామానుజన్ వెల్లడించారు.