రెండేళ్లుగా తాగునీటికి కటకట | Sakshi
Sakshi News home page

రెండేళ్లుగా తాగునీటికి కటకట

Published Wed, Sep 9 2015 4:17 AM

రెండేళ్లుగా తాగునీటికి కటకట

కెలమంగలం : కెలమంగలం సమితి బైరమంగలం పంచాయతీలో గత రెండేళ్లుగా ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక యంత్రాంగం పట్టించుకోకపోవడంతో ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.పంచాయతీలోని బైరమంగలంలో 1000 ఇళ్లకుపైగా ఉన్నాయని, కారుకొండపల్లి, అగ్గొండపల్లి గ్రామాలలో కూడా ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని 15 రోజులకొకసారి నీరందంచడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.పశువులకు తాగునీటి కొరత ఏర్పడిందని, ఇటీవలే ఎం.పి.పర్యటించి వెళ్లారని, కానీ తాగునీటి సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు వాపోతున్నారు. కెలమంగలం సమితి అధికార్లు కూడా పట్టించుకోకపోవడంతో  కార్మికులు ఎక్కువగానున్న అగ్గొండపల్లి, కారుకొండపల్లి గ్రామాలలో తాగునీటికి ప్రజలు అల్లాడిపోతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement